తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్పై మృతదేహం
- తాడిపత్రి రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతదేహం
- గతంలో డాలర్ల దొంగతనంపై ఫిర్యాదు చేసింది సతీశ్ కుమారే
- విచారణ వేళ ఆయన మృతి చెందడంపై పలు అనుమానాలు
వివరాల్లోకి వెళితే.. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్లను రవికుమార్ అనే వ్యక్తి దొంగిలించాడని ఆరోపిస్తూ అప్పటి ఏవీఎస్వోగా ఉన్న సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, అనూహ్యంగా సతీశ్ కుమార్ కోర్టులో ఆ కేసును రాజీ చేసుకున్నారు. కొందరు రాజకీయ నాయకులు, టీటీడీ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ఆయన రాజీకి అంగీకరించారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ రాజీ వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసు తిరిగి విచారణకు వచ్చింది. ప్రస్తుతం సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో, కేసులో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న సతీశ్ కుమార్ రైల్వే ట్రాక్పై శవమై తేలడం వెనుక కుట్ర కోణం ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో పరకామణి కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.