ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు.. మెయిల్ పంపిన దుండగులు
- ఢిల్లీ, కోల్కతా, తిరువనంతపురం నుంచి నడుస్తున్న విమానాశ్రయాల్లో బాంబు అమర్చినట్లు బెదిరింపులు
- విమానాశ్రయ అధికారులను అలర్ట్ చేసిన అధికారులు
- విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించిన అధికారులు
కోల్కతా నుంచి ముంబైకి వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో, ఆ విమానంలోని 186 మంది ప్రయాణికులను కిందకు దించి, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఢిల్లీ, తిరువనంతపురం విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్ బృందాలతో ఇండిగో విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.