AP Housing Scheme: పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో నేడు 3 లక్షల ఇళ్లలోకి లబ్ధిదారులు...రాయచోటిలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు
- అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
- అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం
- గత ప్రభుత్వంలో రద్దయిన ఇళ్లకు భిన్నంగా వేగంగా నిర్మాణాలు పూర్తి
- మిగిలిన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, అధికారంలోకి వచ్చిన 17 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు బుధవారం సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)లోని వివిధ విభాగాల కింద ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది. పీఎంఏవై-అర్బన్ కింద 2,28,034, పీఎంఏవై-గ్రామీణ్ కింద 65,292, పీఎంఏవై-జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లను నిర్మించారు. మొత్తం 3,00,192 ఇళ్లలో లబ్ధిదారులు ఒకేరోజు గృహ ప్రవేశాలు చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
అన్నమయ్య జిల్లాలో సీఎం పర్యటన
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఈరోజు అన్నమయ్య జిల్లాకు వెళ్లనున్నారు. రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడ లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహ ప్రవేశాలు చేసి, వారికి ఇంటి తాళాలను స్వయంగా అందిస్తారు. అనంతరం అక్కడి నుంచే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పూర్తయిన ఇళ్లను వర్చువల్గా ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజావేదిక సభలో ప్రసంగించడంతో పాటు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షించారు.
గత ప్రభుత్వ హయాంలో 4.73 లక్షల ఇళ్లను రద్దు చేయడం, లక్షల మంది లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్లో పెట్టడం జరిగిందని ప్రభుత్వం గుర్తుచేసింది. అయితే, 2014-19 మధ్య టీడీపీ హయాంలో 8 లక్షల ఇళ్లు నిర్మించామని, ఇప్పుడు 17 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేశామని తెలిపింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మిగతా ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)లోని వివిధ విభాగాల కింద ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది. పీఎంఏవై-అర్బన్ కింద 2,28,034, పీఎంఏవై-గ్రామీణ్ కింద 65,292, పీఎంఏవై-జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లను నిర్మించారు. మొత్తం 3,00,192 ఇళ్లలో లబ్ధిదారులు ఒకేరోజు గృహ ప్రవేశాలు చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
అన్నమయ్య జిల్లాలో సీఎం పర్యటన
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఈరోజు అన్నమయ్య జిల్లాకు వెళ్లనున్నారు. రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడ లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహ ప్రవేశాలు చేసి, వారికి ఇంటి తాళాలను స్వయంగా అందిస్తారు. అనంతరం అక్కడి నుంచే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పూర్తయిన ఇళ్లను వర్చువల్గా ప్రారంభిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజావేదిక సభలో ప్రసంగించడంతో పాటు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షించారు.
గత ప్రభుత్వ హయాంలో 4.73 లక్షల ఇళ్లను రద్దు చేయడం, లక్షల మంది లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్లో పెట్టడం జరిగిందని ప్రభుత్వం గుర్తుచేసింది. అయితే, 2014-19 మధ్య టీడీపీ హయాంలో 8 లక్షల ఇళ్లు నిర్మించామని, ఇప్పుడు 17 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేశామని తెలిపింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మిగతా ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.