బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ కూటమికే ఆ సామాజిక వర్గాల ఓట్లు!
- బీజేపీ వైపు మొగ్గు చూపిన ఓబీసీ, ఎస్సీ ఓటర్లు
- కాంగ్రెస్కు ఓటేసిన 78 శాతం మంది ముస్లింలు
- ప్రభావం చూపని ప్రశాంత్ కిశోర్ పార్టీ
మంగళవారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం, బీహార్లో ఓబీసీలు, ఎస్సీ సామాజిక వర్గాలు బీజేపీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు అనుకూలంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ఓబీసీ ఓటర్లలో 51 శాతం మంది, ఎస్సీ ఓటర్లలో 49 శాతం మంది బీజేపీ, జేడీయూ కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ డేటా వెల్లడించింది.
అదే సమయంలో ముస్లిం వర్గం ఓట్లు 78 శాతం వరకు ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్కు పడి ఉంటాయని తెలిపింది.
ఎన్డీయే వైపు జనరల్లో మొగ్గు చూపిన వారు 69 శాతం, ఓబీసీలు 51 శాతం, ఎస్సీలు 49 శాతం, ముస్లింలు 10 శాతం ఉన్నారని ఈ ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది.
మహాఘట్బంధన్ వైపు జనరల్లో మొగ్గు చూపిన వారు 15 శాతం, ఓబీసీలు 39 శాతం, ఎస్సీలు 38 శాతం, ముస్లింలు 78 శాతం ఉన్నారని ఈ ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది.
ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీకి జనరల్లో మొగ్గు చూపిన వారు 7 శాతం, ఓబీసీలు 4 శాతం, ఎస్సీలు 5 శాతం, ముస్లింలు 4 శాతం ఉన్నారని ఈ ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది.