జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్
- జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవబోతుందన్న టీపీసీసీ చీఫ్
- ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయం చెప్పాయన్న మహేశ్ కుమార్ గౌడ్
- ప్రజలంతా నవీన్ వైపు నిలిచారని వ్యాఖ్య
ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను ముందుండి నడిపించారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తారని, ఆయన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ టీపీసీసీ చీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో తాము సఫలీకృతం చెందామని ఆయన అన్నారు.