సినీ నటుడు అజిత్ ఇంటికి, కాంగ్రెస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు
- చెన్నైలో కొన్ని రోజులుగా నాయకులు, సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు
- సినీ నటుడు అజిత్ కుమార్ ఇల్లు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్కు బాంబు బెదిరింపులు
- తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని గుర్తించిన బాంబు స్క్వాడ్
సమాచారం అందిన వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి ఆయా ప్రాంతాలలో తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎటువంటి బాంబులు లేవని నిర్ధారించారు. ఇదివరకే ఎస్వీ శేఖర్, నటి రమ్యకృష్ణ ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం విదితమే. సోమవారం నాడు నటి త్రిష నివాసం, ఈడీ డైరెక్టరేట్ కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులకు పాల్పడుతున్నది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.