Pawan Kalyan: తిరుపతి లడ్డూ కేవలం స్వీట్ కాదు... హిందువుల విశ్వాసాలతో ఆడుకోవద్దు: పవన్ కల్యాణ్
- సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలంటూ పవన్ కల్యాణ్ ట్వీట్
- తిరుపతి లడ్డూ కేవలం ప్రసాదం కాదు, అది ఒక ఉమ్మడి భావోద్వేగం అని వెల్లడి
- సనాతన ఆచారాలను ఎగతాళి చేయడం కోట్ల మంది నమ్మకాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యలు
- లౌకికవాదం అనేది రెండు వైపులా ఉండాలని స్పష్టీకరణ
సనాతన ధర్మాన్ని, హిందువుల మనోభావాలను పరిరక్షించేందుకు 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు'ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్త హిందూ సమాజానికి కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదని, అదొక పవిత్రమైన ఆధ్యాత్మిక గమ్యస్థానం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, "తిరుపతి లడ్డూ కేవలం ఒక స్వీట్ కాదు, అది మనందరి ఉమ్మడి భావోద్వేగం. స్నేహితులు, కుటుంబ సభ్యులు, చివరికి అపరిచితులతో కూడా మనం ఆ ప్రసాదాన్ని పంచుకుంటాం. ఎందుకంటే, అది మన సామూహిక విశ్వాసానికి, ప్రగాఢ భక్తికి ప్రతీక" అని వివరించారు. ఏటా సగటున 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారని గుర్తుచేశారు.
"సనాతనుల మనోభావాలను, ఆచారాలను ఎగతాళి చేసినప్పుడు లేదా కించపరిచినప్పుడు అది కేవలం బాధ కలిగించడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. లౌకికవాదం అనేది రెండు వైపులా ఉండాలి. మా విశ్వాసానికి రక్షణ, గౌరవం ఇవ్వడంలో రాజీ పడకూడదు" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
మన సనాతన ధర్మం అత్యంత పురాతనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికత అని పేర్కొన్న పవన్, భాగస్వాములందరి ఏకాభిప్రాయంతో 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు'ను స్థాపించడానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతకుముందు, నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో తిరుపతి లడ్డూ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. "పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయం చేయకుండా ఇప్పటికైనా తప్పు చేసిన వాడిని శిక్షించే పని చూడండి" అంటూ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, "తిరుపతి లడ్డూ కేవలం ఒక స్వీట్ కాదు, అది మనందరి ఉమ్మడి భావోద్వేగం. స్నేహితులు, కుటుంబ సభ్యులు, చివరికి అపరిచితులతో కూడా మనం ఆ ప్రసాదాన్ని పంచుకుంటాం. ఎందుకంటే, అది మన సామూహిక విశ్వాసానికి, ప్రగాఢ భక్తికి ప్రతీక" అని వివరించారు. ఏటా సగటున 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారని గుర్తుచేశారు.
"సనాతనుల మనోభావాలను, ఆచారాలను ఎగతాళి చేసినప్పుడు లేదా కించపరిచినప్పుడు అది కేవలం బాధ కలిగించడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. లౌకికవాదం అనేది రెండు వైపులా ఉండాలి. మా విశ్వాసానికి రక్షణ, గౌరవం ఇవ్వడంలో రాజీ పడకూడదు" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
మన సనాతన ధర్మం అత్యంత పురాతనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికత అని పేర్కొన్న పవన్, భాగస్వాములందరి ఏకాభిప్రాయంతో 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు'ను స్థాపించడానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతకుముందు, నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో తిరుపతి లడ్డూ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. "పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయం చేయకుండా ఇప్పటికైనా తప్పు చేసిన వాడిని శిక్షించే పని చూడండి" అంటూ ట్వీట్ చేశారు.