టీ20 ప్రపంచ కప్.. ఆటగాళ్లకు గౌతమ్ గంభీర్ కీలక సూచన
- మరో మూడు నెలల సమయం మాత్రమే ఉందన్న గౌతమ్ గంభీర్
- ప్రపంచ కప్ కోసం పూర్తిగా సన్నద్ధమవ్వాలని సూచన
- భారత్, శ్రీలంకలలో టీ20 ప్రపంచ కప్
టీమిండియా డ్రెస్సింగ్ రూం పారదర్శకంగా ఉంటుందని, దానిని కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నాడు. టీ20 ప్రపంచ కప్ కోసం పూర్తిగా సన్నద్ధం కావాల్సి ఉందని సూచన చేశాడు. మరో మూడు నెలల సమయం మాత్రమే ఉందని, ఇలాంటి సమయంలో ఆటగాళ్లంతా ఫిట్నెస్ ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 భారత్, శ్రీలంకలో జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8 వరకు మ్యాచ్లు జరగనుండగా, భారత్లోని ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా వేదికలు కానున్నాయి. పాకిస్థాన్ ఆడే మ్యాచ్లకు శ్రీలంకలోని కొలంబో, క్యాండీ వేదికలు కానున్నాయి. పాకిస్థాన్ ఫైనల్ చేరుకుంటే తుది పోరు కొలంబోలో, నిష్క్రమిస్తే అహ్మదాబాద్లో జరగనుంది.