విజయ్ తో వైరంపై స్పందించిన అజిత్
- విజయ్తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పిన అజిత్
- కొందరు పనిగట్టుకుని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపణ
- విజయ్కు ఎప్పుడూ మంచే జరగాలని కోరుకుంటానని వెల్లడి
ఈ విషయంపై అజిత్ మాట్లాడుతూ.. "కొంతమంది మా ఇద్దరి మధ్య అపోహలు సృష్టిస్తున్నారు. వాటిని చూసి అభిమానులు పరస్పరం గొడవ పడుతున్నారు. ఇలా సమస్యలు సృష్టించేవారు మౌనంగా ఉంటే అందరికీ మంచిది. నేను ఎప్పుడూ విజయ్కి మంచి జరగాలనే కోరుకుంటాను, ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటాను" అని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి బయటపడింది.
ఇటీవల అజిత్ మేనేజర్ సైతం ఇదే విషయంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. అజిత్, విజయ్ మంచి స్నేహితులని, అజిత్కు పద్మభూషణ్ వచ్చినప్పుడు మొట్టమొదట శుభాకాంక్షలు చెప్పింది విజయ్ అని ఆయన గుర్తుచేశారు. ఈ తాజా వ్యాఖ్యలు ఆ వాదనకు మరింత బలాన్నిచ్చాయి.
ఇక విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటన గురించి కూడా అజిత్ మాట్లాడారు. ఆ ఘటనకు విజయ్ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని, మనందరం బాధ్యులమేనని అన్నారు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం తన ఉద్దేశం కాదని చెబుతూ, ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.