AP Road Mishap: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీటీవీ కెమెరాలో రికార్డైన భయానక దృశ్యాలు

Bapatla Road Accident Sheikh Rizwan and Friend Die in Crash
  • లారీని వేగంగా ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు యువకుల స్పాట్‌డెడ్
  • మృతులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తింపు
  • సూర్యలంక బీచ్ నుంచి తిరిగి వస్తుండగా దుర్ఘటన
  • అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ
ఏపీలోని బాపట్ల పట్టణంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ లారీని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) స్నేహితులు. వీరిద్దరూ బుధవారం రాత్రి బైక్‌పై సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. అయితే, బీచ్ మూసి ఉండటంతో తిరిగి గుంటూరుకు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 2:34 గంటల సమయంలో బాపట్ల గడియారం స్తంభం కూడలి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో చీరాల నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ లారీని వీరి బైక్ బలంగా ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదానికి బైక్ అతివేగమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP Road Mishap
Sheikh Rizwan
Bapatla road accident
Andhra Pradesh accident
Chintala Nani
Guntur road accident
Suryalanka beach
Bapatla clock tower
Road accident CCTV footage

More Telugu News