Dawood Ibrahim: దక్షిణాదిపై దావూద్ కన్ను.. డ్రగ్స్ దందాకు ఎల్టీటీఈతో పొత్తు
- ఉత్తరాదిలో దెబ్బతినడంతో దక్షిణాది మార్కెట్పై దావూద్ గ్యాంగ్ దృష్టి
- పునరుజ్జీవం కోసం నిధులు సమకూర్చుకునేందుకు ఎల్టీటీఈ ప్రయత్నం
- డబ్బు, వనరులు డీ-గ్యాంగ్.. రూట్లు, అనుభవం ఎల్టీటీఈవి
- ఇది అత్యంత ప్రమాదకరమైన కలయిక అంటున్న నిఘా వర్గాలు
దేశంలో అండర్వరల్డ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న దావూద్ ఇబ్రహీం సిండికేట్ (డీ-గ్యాంగ్) ఇప్పుడు తన డ్రగ్స్ వ్యాపారాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరించేందుకు భారీ ప్రణాళిక రచిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లలో కార్యకలాపాలు దెబ్బతినడంతో దక్షిణాది మార్కెట్పై కన్నేసింది. ఇందుకోసం ఒకప్పటి శ్రీలంక మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) నెట్వర్క్ను వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రెండు ప్రమాదకర శక్తులు చేతులు కలపడం దేశ భద్రతకు పెను సవాల్గా మారనుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం, డీ-గ్యాంగ్ సభ్యులు శ్రీలంక, భారత్లోని మాజీ ఎల్టీటీఈ కార్యకర్తలు, సానుభూతిపరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. డ్రగ్స్ రవాణాకు అనువైన మార్గాలను గుర్తించి, వ్యాపారాన్ని నడిపించేందుకు వారి సహాయం కోరుతున్నారు. శ్రీలంక సైన్యం చేతిలో దారుణంగా దెబ్బతిని, నిధుల కొరతతో బలహీనపడిన ఎల్టీటీఈకి ఇది ఒక అవకాశంగా కనిపిస్తోంది. డీ-గ్యాంగ్తో పొత్తు ద్వారా వచ్చే డబ్బుతో మళ్లీ పుంజుకోవాలని, కొత్తగా సభ్యులను చేర్చుకుని, ఆయుధాలు సమకూర్చుకోవాలని ఎల్టీటీఈ భావిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సైతం తన దర్యాప్తులో గుర్తించింది.
ఈ కలయిక ఇరు వర్గాలకూ ప్రయోజనకరంగా ఉంది. డీ-గ్యాంగ్కు డబ్బు, వనరులు ఉన్నాయి. కానీ, దక్షిణాదిలోని భూ, సముద్ర మార్గాలపై వారికి పట్టు లేదు. మరోవైపు ఎల్టీటీఈకి ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. వారి నెట్వర్క్, అనుభవం డీ-గ్యాంగ్కు డ్రగ్స్ రవాణాలో కీలకం కానున్నాయి. గతంలో పాక్ జలసంధి మీదుగా జరిగే డ్రగ్స్ దందా మొత్తం ఎల్టీటీఈ నియంత్రణలోనే ఉండేది. 1980ల నుంచే ఈ వ్యాపారంలో ఉన్న ఎల్టీటీఈ, శ్రీలంకను అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు కేంద్రంగా మార్చింది.
సుమారు మూడేళ్ల క్రితం కూడా ఎల్టీటీఈ సభ్యులు శ్రీలంక నుంచి భారత్కు ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ లక్షద్వీప్ వద్ద అధికారులకు పట్టుబడ్డారు. ఇప్పుడు డీ-గ్యాంగ్తో జతకట్టడం ద్వారా వారి కార్యకలాపాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఎల్టీటీఈ పునరుజ్జీవం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనని అధికారులు భావిస్తున్నప్పటికీ, డీ-గ్యాంగ్ దక్షిణాది మార్కెట్ను చేజిక్కించుకోవడం మాత్రం అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తున్నారు. డీ-గ్యాంగ్, ఎల్టీటీఈల ఈ కొత్త బంధం భద్రతా సంస్థలకు పెను తలనొప్పిగా మారింది.
నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం, డీ-గ్యాంగ్ సభ్యులు శ్రీలంక, భారత్లోని మాజీ ఎల్టీటీఈ కార్యకర్తలు, సానుభూతిపరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. డ్రగ్స్ రవాణాకు అనువైన మార్గాలను గుర్తించి, వ్యాపారాన్ని నడిపించేందుకు వారి సహాయం కోరుతున్నారు. శ్రీలంక సైన్యం చేతిలో దారుణంగా దెబ్బతిని, నిధుల కొరతతో బలహీనపడిన ఎల్టీటీఈకి ఇది ఒక అవకాశంగా కనిపిస్తోంది. డీ-గ్యాంగ్తో పొత్తు ద్వారా వచ్చే డబ్బుతో మళ్లీ పుంజుకోవాలని, కొత్తగా సభ్యులను చేర్చుకుని, ఆయుధాలు సమకూర్చుకోవాలని ఎల్టీటీఈ భావిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సైతం తన దర్యాప్తులో గుర్తించింది.
ఈ కలయిక ఇరు వర్గాలకూ ప్రయోజనకరంగా ఉంది. డీ-గ్యాంగ్కు డబ్బు, వనరులు ఉన్నాయి. కానీ, దక్షిణాదిలోని భూ, సముద్ర మార్గాలపై వారికి పట్టు లేదు. మరోవైపు ఎల్టీటీఈకి ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. వారి నెట్వర్క్, అనుభవం డీ-గ్యాంగ్కు డ్రగ్స్ రవాణాలో కీలకం కానున్నాయి. గతంలో పాక్ జలసంధి మీదుగా జరిగే డ్రగ్స్ దందా మొత్తం ఎల్టీటీఈ నియంత్రణలోనే ఉండేది. 1980ల నుంచే ఈ వ్యాపారంలో ఉన్న ఎల్టీటీఈ, శ్రీలంకను అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు కేంద్రంగా మార్చింది.
సుమారు మూడేళ్ల క్రితం కూడా ఎల్టీటీఈ సభ్యులు శ్రీలంక నుంచి భారత్కు ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ లక్షద్వీప్ వద్ద అధికారులకు పట్టుబడ్డారు. ఇప్పుడు డీ-గ్యాంగ్తో జతకట్టడం ద్వారా వారి కార్యకలాపాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఎల్టీటీఈ పునరుజ్జీవం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనని అధికారులు భావిస్తున్నప్పటికీ, డీ-గ్యాంగ్ దక్షిణాది మార్కెట్ను చేజిక్కించుకోవడం మాత్రం అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తున్నారు. డీ-గ్యాంగ్, ఎల్టీటీఈల ఈ కొత్త బంధం భద్రతా సంస్థలకు పెను తలనొప్పిగా మారింది.