బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే పరిస్థితి ఉంది.. ఈ విషయాన్ని కవిత చెప్పారు: రేవంత్ రెడ్డి
- బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శ
- బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందన్న ముఖ్యమంత్రి
- జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ మైనారిటీలకు భరోసా ఇచ్చారని వెల్లడి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలోని మైనారిటీలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి 3 నెలలైనా స్పందించలేదని విమర్శించారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.