అరికెపూడి గాంధీ చేసిన ఆరోపణలపై ఏ జడ్జితో విచారణకైనా సిద్ధమే: మాధవరం కృష్ణారావు
- శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరోపణలపై కృష్ణారావు స్పందన
- తన ఇల్లు, కాలేజీ, భూములపై విచారణ జరపాలని డిమాండ్
- ఎమ్మెల్యే గాంధీపై ఎదురు ప్రశ్నలు సంధించిన కృష్ణారావు
- ప్రీలాంచ్ పేరుతో అనుమతిలేని ప్లాట్లు అమ్మారని ఆరోపణ
- రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగొద్దని హితవు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీని ఉద్దేశించి కృష్ణారావు పలు ప్రశ్నలు సంధించారు. "సర్వే నంబర్ 57లోని భూమి మీ ప్రమేయం లేకుండానే ప్రైవేట్ భూమిగా మారుతుందా? పేదల భూములు కూల్చివేస్తే సరైంది, అదే మీ భూముల విషయంలో జరిగితే హైడ్రా కమిషనర్ చేసింది తప్పెలా అవుతుంది?" అని ప్రశ్నించారు. హైడ్రా అధికారులు తప్పు చేసి ఉంటే, హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఎందుకు పోరాడుతారని నిలదీశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని సవాల్ చేశారు.
అదేవిధంగా, ఎమ్మెల్యే హోదాలో ఉండి ప్రీలాంచ్ పేరుతో అనుమతులు లేని ప్లాట్లను ఎవరు విక్రయించారో చెప్పాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. అరికపూడి గాంధీ ఎస్టేట్ ఎవరిదో కూడా విచారణ జరిపించాలని కోరారు. రాజకీయాల్లోకి కుటుంబ విషయాలను తీసుకురావడం సరికాదని, హుందాగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.