విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న మహిళా టీచర్
- శ్రీకాకుళం గిరిజన పాఠశాలలో టీచర్ నిర్వాకం
- క్లాస్ రూంలో ఫోన్ మాట్లాడుతూ విద్యార్థినులతో సేవలు
- విచారణకు ఆదేశించామని తెలిపిన ఉన్నతాధికారులు
ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతోందని, ఆలస్యంగా వీడియో బయటకు రావడంతో టీచర్ నిర్వాకం వెలుగు చూసిందని విద్యార్థినులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ స్పందిస్తూ.. ఆ టీచర్ కు ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని తెలిపారు. విద్యార్థినులతో టీచర్ కాళ్లు పట్టించుకున్న ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వివరించారు.