Nara Lokesh: సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఏపీ మంత్రి లోకేశ్ .. బాధిత బాలికను ఆదుకుంటామని భరోసా
- కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న చిన్నారి కీర్తనా రెడ్డి
- ఆదుకోవాలంటూ సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనం
- ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లిన నెటిజన్
- వెంటనే స్పందించి భరోసా ఇచ్చిన నారా లోకేశ్
- మానవత్వానికి రాజకీయాలు అడ్డుకావన్న మంత్రి
- సహాయం అందించాలని తన బృందానికి ఆదేశాలు
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారికి సాయం చేసేందుకు మంత్రి నారా లోకేశ్ ముందుకు వచ్చారు. రాజకీయాలకు అతీతంగా మానవత్వానికే పెద్దపీట వేస్తానని ఆయన స్పష్టం చేశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కీర్తనా రెడ్డి అనే చిన్నారి దీనస్థితిపై ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించి, అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం చిన్నపురంకు చెందిన ఓబుల్ రెడ్డి కుమార్తె కీర్తనా రెడ్డి గత ఏడాది పదవ తరగతి పరీక్షలు రాసిన తర్వాత రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లి తన కిడ్నీని దానం చేసింది. అయితే, ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని దయనీయ స్థితిలో ఆ కుటుంబం ఉంది. ఈ విషయాన్ని శరత్ కుమార్ అనే వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. సాక్షి పత్రికలో 'కీర్తనను ఆదుకోరూ' అంటూ వచ్చిన కథనాన్ని ట్యాగ్ చేస్తూ, చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఈ పోస్టుపై మంత్రి లోకేశ్ స్పందించారు. "మీ రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా, ఈ విషయం నిజమైతే తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తాను. మానవత్వంతో సాయం చేసేందుకు ముందుంటాను" అని ఆయన బదులిచ్చారు. కీర్తన వివరాలు తన దృష్టికి వచ్చాయని, అవసరమైన సహాయం ఆ కుటుంబానికి అందేలా చూడాలని తన బృందాన్ని ఆదేశించినట్లు తెలిపారు.
"ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ తల్లీ, కుమార్తె బాధపడకూడదు. మా పాలనలో కరుణకు పార్టీల భేదం లేదు" అని లోకేశ్ తన పోస్టులో స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించి భరోసా ఇవ్వడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం చిన్నపురంకు చెందిన ఓబుల్ రెడ్డి కుమార్తె కీర్తనా రెడ్డి గత ఏడాది పదవ తరగతి పరీక్షలు రాసిన తర్వాత రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లి తన కిడ్నీని దానం చేసింది. అయితే, ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని దయనీయ స్థితిలో ఆ కుటుంబం ఉంది. ఈ విషయాన్ని శరత్ కుమార్ అనే వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. సాక్షి పత్రికలో 'కీర్తనను ఆదుకోరూ' అంటూ వచ్చిన కథనాన్ని ట్యాగ్ చేస్తూ, చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఈ పోస్టుపై మంత్రి లోకేశ్ స్పందించారు. "మీ రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా, ఈ విషయం నిజమైతే తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తాను. మానవత్వంతో సాయం చేసేందుకు ముందుంటాను" అని ఆయన బదులిచ్చారు. కీర్తన వివరాలు తన దృష్టికి వచ్చాయని, అవసరమైన సహాయం ఆ కుటుంబానికి అందేలా చూడాలని తన బృందాన్ని ఆదేశించినట్లు తెలిపారు.
"ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ తల్లీ, కుమార్తె బాధపడకూడదు. మా పాలనలో కరుణకు పార్టీల భేదం లేదు" అని లోకేశ్ తన పోస్టులో స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించి భరోసా ఇవ్వడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.