Basawan: అక్బర్ ఆస్థాన చిత్రకారుడి పెయింటింగ్కు కోట్లు.. అంచనాలకు 14 రెట్లు అధిక ధర!
- మొఘలుల కాలం నాటి పెయింటింగ్కు రికార్డు ధర
- లండన్ వేలంలో రూ.119.49 కోట్లకు అమ్మకం
- అక్బర్ ఆస్థాన చిత్రకారుడు బసవాన్ గీసిన చిత్రం
- భారతీయ పెయింటింగ్స్లో రెండో అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు
- ప్రిన్స్ సద్రుద్దీన్ ఖాన్ దంపతుల సేకరణలో భాగం
మొఘలుల కాలం నాటి ఓ అరుదైన పెయింటింగ్ వేలంలో సంచలనం సృష్టించింది. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలోని ప్రముఖ చిత్రకారుడు బసవాన్ గీసిన 'చిరుతల కుటుంబం' అనే చిత్రం లండన్లో జరిగిన వేలంలో ఏకంగా రూ.119.49 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం నిర్వాహకులు ఊహించిన దానికంటే ఇది 14 రెట్లు అధిక ధర కావడం విశేషం.
అక్టోబర్ 28న లండన్లో ఈ వేలం నిర్వహించారు. 1575-80 మధ్య కాలంలో ఈ చిత్రాన్ని గీసినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్షియన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ సద్రుద్దీన్ ఆగా ఖాన్, ఆయన భార్య క్యాథరిన్ వ్యక్తిగతంగా సేకరించిన పురాతన వస్తువుల సేకరణలో ఈ పెయింటింగ్ కూడా ఒకటి. వీరి సేకరణ నుంచి మొత్తం 95 వస్తువులను వేలానికి ఉంచగా, వాటి ద్వారా సుమారు రూ.533.79 కోట్లు సమకూరాయి. స్విట్జర్లాండ్లోని తమ నివాసంలో వీరు ఈ కళాఖండాలను భద్రపరిచారు. నాలుగు ఖండాలకు చెందిన 20 దేశాల వారు ఈ వేలంలో పాల్గొనడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
భారతీయ చిత్రకళకు సంబంధించి ఇది రెండో అత్యంత ఖరీదైన పెయింటింగ్గా రికార్డు సృష్టించింది. గత మార్చిలో న్యూయార్క్లో జరిగిన వేలంలో ప్రఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ గీసిన 'గ్రామ్ యాత్ర' చిత్రం రూ.122 కోట్లకు అమ్ముడై మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు దాని తర్వాత బసవాన్ చిత్రం నిలిచింది. 1933లో ఫ్రాన్స్లో జన్మించిన ప్రిన్స్ సద్రుద్దీన్ ఖాన్, 1960-80ల మధ్య మొఘలులు, తురుష్కుల కాలం నాటి ఎన్నో పురాతన వస్తువులను సేకరించారు.
అక్టోబర్ 28న లండన్లో ఈ వేలం నిర్వహించారు. 1575-80 మధ్య కాలంలో ఈ చిత్రాన్ని గీసినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్షియన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ సద్రుద్దీన్ ఆగా ఖాన్, ఆయన భార్య క్యాథరిన్ వ్యక్తిగతంగా సేకరించిన పురాతన వస్తువుల సేకరణలో ఈ పెయింటింగ్ కూడా ఒకటి. వీరి సేకరణ నుంచి మొత్తం 95 వస్తువులను వేలానికి ఉంచగా, వాటి ద్వారా సుమారు రూ.533.79 కోట్లు సమకూరాయి. స్విట్జర్లాండ్లోని తమ నివాసంలో వీరు ఈ కళాఖండాలను భద్రపరిచారు. నాలుగు ఖండాలకు చెందిన 20 దేశాల వారు ఈ వేలంలో పాల్గొనడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
భారతీయ చిత్రకళకు సంబంధించి ఇది రెండో అత్యంత ఖరీదైన పెయింటింగ్గా రికార్డు సృష్టించింది. గత మార్చిలో న్యూయార్క్లో జరిగిన వేలంలో ప్రఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ గీసిన 'గ్రామ్ యాత్ర' చిత్రం రూ.122 కోట్లకు అమ్ముడై మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు దాని తర్వాత బసవాన్ చిత్రం నిలిచింది. 1933లో ఫ్రాన్స్లో జన్మించిన ప్రిన్స్ సద్రుద్దీన్ ఖాన్, 1960-80ల మధ్య మొఘలులు, తురుష్కుల కాలం నాటి ఎన్నో పురాతన వస్తువులను సేకరించారు.