Indian Women's Cricket Team: సాహో టీమిండియా!... వరల్డ్ కప్ సెమీస్ లో విజయంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పందన

Indian Womens Cricket Team Victory Sparks Celebrations
  • మహిళల ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ చారిత్రక విజయం
  • ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమిండియా
  • ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత మహిళల జట్టు
  • జెమీమా, హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత భాగస్వామ్యం
  • జట్టును అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 
  • మంత్రి నారా లోకేశ్ కూడా ప్రశంసలు
మహిళల ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ అద్భుత విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా జట్టుకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ, "టీమిండియాకు వందనాలు. మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి, ఫైనల్లోకి దూసుకెళ్లడం ద్వారా మన జట్టు చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు ప్రత్యేక ప్రశంసలు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో 300 పైచిలుకు లక్ష్యాన్ని తొలిసారి ఛేదించి, జీవితంలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారు. విజయం కోసం ఇలాగే పోరాడండి.. మేమంతా మీకు మద్దతుగా ఉన్నాం" అని పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేశ్ కూడా భారత జట్టు విజయాన్ని కొనియాడారు. "ఆస్ట్రేలియాపై భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా ఏమాత్రం బెదరకుండా జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు ఘనవిజయాన్ని అందించింది. ఆమెకు హర్మన్‌ప్రీత్ కౌర్ అసాధారణ సంయమనం, ఆత్మవిశ్వాసంతో తోడు నిలిచింది. కీలకమైన 89 పరుగులు చేసి చక్కటి సహకారం అందించింది. ఈ నిర్భయమైన జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లడం గర్వంగా ఉంది. జై హింద్!" అని తన సందేశంలో తెలిపారు.
Indian Women's Cricket Team
Chandrababu Naidu
Nara Lokesh
Women's World Cup
Jemimah Rodrigues
Harmanpreet Kaur
Australia
Semi-Finals
Cricket
Andhra Pradesh

More Telugu News