Chandrababu Naidu: సమర్థ పాలనతో మొంథా తుఫాన్పై విజయం... తుఫాన్ సహాయక చర్యల్లో ప్రతిబింబించిన సీబీఎన్ మార్క్
- ఆర్టీజీ సెంటర్ నుంచి రియల్ టైమ్లో పర్యవేక్షణ, పరిష్కారం
- ఫైవ్ పాయింట్ ఫార్మూలాతో పని చేసిన టీమ్ ఆంధ్రప్రదేశ్
- మానిటర్, అలెర్ట్, రెస్క్యూ, రిహాబిలిటేషన్, నార్మల్సీ వంటి అంశాలపై ఫోకస్
- రక్షణ-సహాయక చర్యల్లో పూర్తి స్థాయిలో టెక్నాలజీ వినియోగం
- ఐదు రోజుల పాటు రాత్రి పగలు పనిచేసిన అధికార యంత్రాంగం
- ప్రభుత్వ ముందస్తు చర్యలతో తగ్గిన ఆస్తి, ప్రాణ నష్టం
- క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల్ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
మానిటర్, అలెర్ట్, రెస్క్యూ, రిహబిలిటేషన్, నార్మల్సీ. మొంథా తుఫాను విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం అమలు చేసిన పంచసూత్ర ప్రణాళిక ఇదే. తుఫాను హెచ్చరికలు వచ్చిన నాటి నుంచి నిరంతరం పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడం, నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, వారికి పునరావాసం కల్పించడం, తుఫాను తగ్గాక సాధారణ పరిస్థితులు తీసుకురావడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది.
దీనికి పూర్తిస్థాయి సాంకేతికతను జోడించడం, క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారులు, ఉద్యోగులతో కూడిన బృందాలతో సమర్థవంతంగా పని చేయించడంతో మొంథా తుఫాను వల్ల కలిగే నష్టాన్ని చాలా వరకు నివారించగలిగారు. ప్రకృతి విపత్తును నివారించే అవకాశం లేదు కాబట్టి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలనే లక్ష్యంతో టీమ్ ఆంధ్రప్రదేశ్ పని చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునే దిశగా ఐదు రోజుల పాటు రాత్రింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసింది. ఇదే ఇప్పుడు సత్ఫలితాలను ఇచ్చింది. మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రం మీద ఎక్కువగా ఉంటుందనే వాతావరణ హెచ్చరిక రాగానే సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు.
తుఫాన్ కదలికలను నిరంతరం సమీక్షించడం, ఏయే ప్రాంతాల్లో ఎక్కువ తుఫాన్ ప్రభావం ఉండొచ్చనే విషయాలను తెలుసుకోవడం, ఆ దిశగా క్షేత్రస్థాయిలో ఉన్న వారిని అప్రమత్తం చేస్తూ మొంథా తుఫాన్ తీరాన్ని తాకినా ప్రజల జీవితాలను తాకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. కొద్దిపాటి ప్రభావం ఉంటుందనుకున్న ప్రాంతాల్లోని వారిని కూడా పునరావాస శిబిరాలకు తరలించారు. లక్ష మందికి పైగా ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. క్షేత్ర స్థాయి నుంచి రియల్ టైంలో సమాచారాన్ని తీసుకోవడం, దాన్ని విశ్లేషించడం, వాటిని ఆయా విభాగాల బాధ్యులకు చేరవేసి, సమస్యను పరిష్కరించేలా చూడడం వంటి ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం సమర్థవంతంగా అమలు చేసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు.
అనుభవానికి సాంకేతికత తోడు
ఇక ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేలా ప్రభుత్వం ఈ విపత్తు కాలంలో పని చేసింది. శిశువుల నుంచి వృద్ధుల వరకు, అలాగే గర్భిణులను కూడా సంరక్షణ కేంద్రానికి తరలించింది. పశువుల ప్రాణాలను కూడా కాపాడేందుకు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేశారు. దీనికి టెక్నాలజీని జోడించారు. దీంట్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వరుసగా 1.1 కోట్ల సందేశాలు పంపారు. అలాగే సాంకేతికతను జోడించి గ్రామాల్లో మైక్ ద్వారా అనౌన్సుమెంట్ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీజీ సెంటర్ నుంచే సెల్ఫోన్ ద్వారా ఆ మైక్ అనౌన్సుమెంటును ఆపరేట్ చేసే విధానాన్ని రూపొందించడమే కాకుండా.. ఒకవేళ సెల్ఫోన్ సిగ్నల్ లేకపోతే శాటిలైట్ ద్వారా ఆ వ్యవస్థ పని చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యల వల్ల గతంతో పోల్చితే ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు తీసుకురావడం సులువైంది. సహజంగా లంక గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడరు.
తుఫాన్లు వచ్చినా ఇళ్ల పైకప్పులపైకి ఎక్కుతారు. కానీ ప్రభుత్వం ముందుగానే అలెర్ట్ చేయడంతోపాటు క్షేత్ర స్థాయి సిబ్బంది కూడా ఇంటింటికీ వెళ్లి వారికి నచ్చజెప్పి తుఫాన్ షెల్టర్లకు తీసుకొచ్చింది. దీంతో ప్రాణ నష్టానికి స్థానం లేకుండా చేయగలిగారు. ఇక టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని మరోసారి రుజువైంది. బాపట్ల జిల్లా పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని డ్రోన్ల ద్వారా గుర్తించి పోలీసులు, అధికారుల బృందం అతణ్ని రక్షించింది.
అలాగే ప్రభుత్వం వద్ద ఉన్న అలెర్ట్ మెకానిజం ద్వారా త్వరగా స్పందించడం వల్లే బాపట్ల జిల్లాలోనే ఒక ప్రార్థనా మందిరానికి వెళ్లి చిక్కుకుపోయిన 15 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడారు. ఈ విషయంలో ఏ మాత్రం అలక్ష్యం వహించినా వారి ప్రాణాలు దక్కేవి కాదు. ఇక గర్భిణులు, దివ్యాంగుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టెక్నాలజీతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా హ్యండిల్ చేయాలనే అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న అనుభవం బాగా కలిసి వచ్చింది.
లైవ్ ట్రాకింగ్, రియల్ టైం సొల్యూషన్స్
ఇక పంటలకు నష్టం వాటిల్లకుండా కూడా ప్రభుత్వం వీలైనంత మేరకు జాగ్రత్తలు తీసుకుంది. తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి కాల్వల్లో గుర్రపు డెక్క తొలగించే అంశాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా చేయడం ద్వారా వీలైనంత మేర పంట నష్టం తగ్గించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఇక డ్రైనేజీలు కూడా క్లీనప్ చేయడంతో నగరాల్లో కూడా నీటి నిల్వ లేకుండా చూడడంలో అధికార యంత్రాంగం సక్సెస్ అయింది. ఇక తుఫాన్ గాలులకు చెట్లు పడిపోయినా, విద్యుత్ స్థంభాలు పడిపోయినా, వైర్లు తెగిపడినా వాటి కారణంగా ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రమాదాలు జరగకుండా వెంటనే వాటిని తొలగించడంతోపాటు విద్యుత్ వ్యవస్థను అతి తక్కువ సమయంలోనే పునరుద్ధరించారు. దీనికోసం అవసరమైన సామాగ్రి, వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకున్నారు.
వేలకొద్ది యంత్రాలను, వాహనాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకున్నారు. ఇక సహాయక చర్యల నిమిత్తం జేసీబీలను కూడా భారీ ఎత్తున సిద్ధం చేసుకుంది. వాటికి లైవ్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన మేరకు వాటిని వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. గతంలో వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా బోట్లు కొట్టుకురావడం, బ్యారేజీల గేట్లకు బలంగా తాకడం వంటివి జరిగేవి. కానీ ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే నెల్లూరు జిల్లా కలెక్టర్ తనకు అందిన సమాచారంతో అప్రమత్తం కావడంతో భారీ బోటును చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. లేకుంటే సంగం బ్యారేజీకి ఆ బోట్లు ఢీ కొట్టి ప్రమాదం ఏర్పడేది. ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం, అలెర్ట్ మెకానిజం ఉండడం వల్ల తప్పిన ప్రమాదాలే. ఇక కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా నిరంతరం పర్యవేక్షించడంతోపాటు గండ్లు పడితే వాటిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు అవసరమైన ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. అలాగే రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీ సెంటర్ ద్వారా వచ్చిన ఆదేశాలు గ్రామ సచివాలయ స్థాయిలో వెంటనే అమలు చేయగలిగేలా విజయవంతంగా ప్రభుత్వం పని చేసింది.
త్వరితగతిన నష్టపరిహారం
పునరావాస శిబిరాలను ముందుగానే సిద్ధం చేశారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సహాయ శిబిరాలను హడావుడిగా ఏర్పాటు చేసుకునే పరిస్థితికి స్వస్తి చెప్పాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి పునరావాస శిబిరాలను సిద్ధం చేసుకోవాలని చెప్పడమే కాకుండా వాటిని అమల్లో పెట్టేలా చేశారు ముఖ్యమంత్రి. బాధితులకు ఆహారం, వసతి కల్పించడంతోపాటు కావాల్సిన మందులను కూడా పునరావాసంలో అందుబాటులో ఉంచారు. ఇలాంటి ఏర్పాట్లను సిద్ధం చేయడంతోపాటు పునరావాస కేంద్రాల్లోని పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అలాగే వైద్య బృందాలను సిద్ధం చేశారు. బాధితులకు అందించే నిత్యావసర వస్తువులను, ఆర్థిక సాయాన్ని కూడా ముందుగానే ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇక పునరావాస శిబిరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు తుఫాన్ వెలిశాక ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇక పంట నష్టం అంచనాలను కూడా త్వరితగతిన వేసి కేంద్రానికి వీలైనంత త్వరగా నివేదికలు సమర్పించే వరకు పూర్తి స్థాయిలో ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం వ్యవహరించింది.
దీనికి పూర్తిస్థాయి సాంకేతికతను జోడించడం, క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారులు, ఉద్యోగులతో కూడిన బృందాలతో సమర్థవంతంగా పని చేయించడంతో మొంథా తుఫాను వల్ల కలిగే నష్టాన్ని చాలా వరకు నివారించగలిగారు. ప్రకృతి విపత్తును నివారించే అవకాశం లేదు కాబట్టి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలనే లక్ష్యంతో టీమ్ ఆంధ్రప్రదేశ్ పని చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునే దిశగా ఐదు రోజుల పాటు రాత్రింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసింది. ఇదే ఇప్పుడు సత్ఫలితాలను ఇచ్చింది. మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రం మీద ఎక్కువగా ఉంటుందనే వాతావరణ హెచ్చరిక రాగానే సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు.
తుఫాన్ కదలికలను నిరంతరం సమీక్షించడం, ఏయే ప్రాంతాల్లో ఎక్కువ తుఫాన్ ప్రభావం ఉండొచ్చనే విషయాలను తెలుసుకోవడం, ఆ దిశగా క్షేత్రస్థాయిలో ఉన్న వారిని అప్రమత్తం చేస్తూ మొంథా తుఫాన్ తీరాన్ని తాకినా ప్రజల జీవితాలను తాకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. కొద్దిపాటి ప్రభావం ఉంటుందనుకున్న ప్రాంతాల్లోని వారిని కూడా పునరావాస శిబిరాలకు తరలించారు. లక్ష మందికి పైగా ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. క్షేత్ర స్థాయి నుంచి రియల్ టైంలో సమాచారాన్ని తీసుకోవడం, దాన్ని విశ్లేషించడం, వాటిని ఆయా విభాగాల బాధ్యులకు చేరవేసి, సమస్యను పరిష్కరించేలా చూడడం వంటి ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం సమర్థవంతంగా అమలు చేసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు.
అనుభవానికి సాంకేతికత తోడు
ఇక ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేలా ప్రభుత్వం ఈ విపత్తు కాలంలో పని చేసింది. శిశువుల నుంచి వృద్ధుల వరకు, అలాగే గర్భిణులను కూడా సంరక్షణ కేంద్రానికి తరలించింది. పశువుల ప్రాణాలను కూడా కాపాడేందుకు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేశారు. దీనికి టెక్నాలజీని జోడించారు. దీంట్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వరుసగా 1.1 కోట్ల సందేశాలు పంపారు. అలాగే సాంకేతికతను జోడించి గ్రామాల్లో మైక్ ద్వారా అనౌన్సుమెంట్ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీజీ సెంటర్ నుంచే సెల్ఫోన్ ద్వారా ఆ మైక్ అనౌన్సుమెంటును ఆపరేట్ చేసే విధానాన్ని రూపొందించడమే కాకుండా.. ఒకవేళ సెల్ఫోన్ సిగ్నల్ లేకపోతే శాటిలైట్ ద్వారా ఆ వ్యవస్థ పని చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యల వల్ల గతంతో పోల్చితే ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు తీసుకురావడం సులువైంది. సహజంగా లంక గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడరు.
తుఫాన్లు వచ్చినా ఇళ్ల పైకప్పులపైకి ఎక్కుతారు. కానీ ప్రభుత్వం ముందుగానే అలెర్ట్ చేయడంతోపాటు క్షేత్ర స్థాయి సిబ్బంది కూడా ఇంటింటికీ వెళ్లి వారికి నచ్చజెప్పి తుఫాన్ షెల్టర్లకు తీసుకొచ్చింది. దీంతో ప్రాణ నష్టానికి స్థానం లేకుండా చేయగలిగారు. ఇక టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని మరోసారి రుజువైంది. బాపట్ల జిల్లా పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని డ్రోన్ల ద్వారా గుర్తించి పోలీసులు, అధికారుల బృందం అతణ్ని రక్షించింది.
అలాగే ప్రభుత్వం వద్ద ఉన్న అలెర్ట్ మెకానిజం ద్వారా త్వరగా స్పందించడం వల్లే బాపట్ల జిల్లాలోనే ఒక ప్రార్థనా మందిరానికి వెళ్లి చిక్కుకుపోయిన 15 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడారు. ఈ విషయంలో ఏ మాత్రం అలక్ష్యం వహించినా వారి ప్రాణాలు దక్కేవి కాదు. ఇక గర్భిణులు, దివ్యాంగుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టెక్నాలజీతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా హ్యండిల్ చేయాలనే అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న అనుభవం బాగా కలిసి వచ్చింది.
లైవ్ ట్రాకింగ్, రియల్ టైం సొల్యూషన్స్
ఇక పంటలకు నష్టం వాటిల్లకుండా కూడా ప్రభుత్వం వీలైనంత మేరకు జాగ్రత్తలు తీసుకుంది. తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి కాల్వల్లో గుర్రపు డెక్క తొలగించే అంశాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా చేయడం ద్వారా వీలైనంత మేర పంట నష్టం తగ్గించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఇక డ్రైనేజీలు కూడా క్లీనప్ చేయడంతో నగరాల్లో కూడా నీటి నిల్వ లేకుండా చూడడంలో అధికార యంత్రాంగం సక్సెస్ అయింది. ఇక తుఫాన్ గాలులకు చెట్లు పడిపోయినా, విద్యుత్ స్థంభాలు పడిపోయినా, వైర్లు తెగిపడినా వాటి కారణంగా ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రమాదాలు జరగకుండా వెంటనే వాటిని తొలగించడంతోపాటు విద్యుత్ వ్యవస్థను అతి తక్కువ సమయంలోనే పునరుద్ధరించారు. దీనికోసం అవసరమైన సామాగ్రి, వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకున్నారు.
వేలకొద్ది యంత్రాలను, వాహనాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకున్నారు. ఇక సహాయక చర్యల నిమిత్తం జేసీబీలను కూడా భారీ ఎత్తున సిద్ధం చేసుకుంది. వాటికి లైవ్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన మేరకు వాటిని వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. గతంలో వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా బోట్లు కొట్టుకురావడం, బ్యారేజీల గేట్లకు బలంగా తాకడం వంటివి జరిగేవి. కానీ ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే నెల్లూరు జిల్లా కలెక్టర్ తనకు అందిన సమాచారంతో అప్రమత్తం కావడంతో భారీ బోటును చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. లేకుంటే సంగం బ్యారేజీకి ఆ బోట్లు ఢీ కొట్టి ప్రమాదం ఏర్పడేది. ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం, అలెర్ట్ మెకానిజం ఉండడం వల్ల తప్పిన ప్రమాదాలే. ఇక కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా నిరంతరం పర్యవేక్షించడంతోపాటు గండ్లు పడితే వాటిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు అవసరమైన ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. అలాగే రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీ సెంటర్ ద్వారా వచ్చిన ఆదేశాలు గ్రామ సచివాలయ స్థాయిలో వెంటనే అమలు చేయగలిగేలా విజయవంతంగా ప్రభుత్వం పని చేసింది.
త్వరితగతిన నష్టపరిహారం
పునరావాస శిబిరాలను ముందుగానే సిద్ధం చేశారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సహాయ శిబిరాలను హడావుడిగా ఏర్పాటు చేసుకునే పరిస్థితికి స్వస్తి చెప్పాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి పునరావాస శిబిరాలను సిద్ధం చేసుకోవాలని చెప్పడమే కాకుండా వాటిని అమల్లో పెట్టేలా చేశారు ముఖ్యమంత్రి. బాధితులకు ఆహారం, వసతి కల్పించడంతోపాటు కావాల్సిన మందులను కూడా పునరావాసంలో అందుబాటులో ఉంచారు. ఇలాంటి ఏర్పాట్లను సిద్ధం చేయడంతోపాటు పునరావాస కేంద్రాల్లోని పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అలాగే వైద్య బృందాలను సిద్ధం చేశారు. బాధితులకు అందించే నిత్యావసర వస్తువులను, ఆర్థిక సాయాన్ని కూడా ముందుగానే ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇక పునరావాస శిబిరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు తుఫాన్ వెలిశాక ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇక పంట నష్టం అంచనాలను కూడా త్వరితగతిన వేసి కేంద్రానికి వీలైనంత త్వరగా నివేదికలు సమర్పించే వరకు పూర్తి స్థాయిలో ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం వ్యవహరించింది.