Veligonda Project: వెలిగొండ సొరంగంలో చిక్కుకున్న 200 మంది కార్మికులను కాపాడిన అధికారులు
- ప్రకాశం జిల్లా వెలిగొండ సొరంగంలోకి చేరిన వరద నీరు
- ప్రాజెక్టు రెండో టన్నెల్లో చిక్కుకుపోయిన 200 మంది కార్మికులు
- కార్మికులను సురక్షితంగా కొల్లం వాగు వద్దకు తరలింపు
- అక్కడి నుంచి బోట్ల ద్వారా శ్రీశైలానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు
- అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపిన అధికారులు
ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు సొరంగంలో పెను ప్రమాదం తప్పింది. సొరంగంలో పనులు నిర్వహిస్తున్న సుమారు 200 మంది కార్మికులు ఆకస్మిక వరదలో చిక్కుకోగా, అధికారులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా వెలుపలికి తీసుకొచ్చారు.
వివరాల్లోకి వెళితే, పెద్ద డోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలో లైనింగ్ పనులు జరుగుతున్నాయి. బుధవారం కార్మికులు విధుల్లో నిమగ్నమై ఉండగా, ఒక్కసారిగా సొరంగంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో లోపల ఉన్న 200 మంది కార్మికులు బయటకు వచ్చే మార్గం లేక చిక్కుకుపోయారు.
ఈ సమాచారం అందుకున్న ప్రాజెక్టు అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులందరినీ కృష్ణా నది సమీపంలోని కొల్లం వాగు వద్దకు సురక్షితంగా చేర్చారు. వారంతా క్షేమంగా ఉన్నారని వెలిగొండ ప్రాజెక్టు ఈఈ కృష్ణారెడ్డి తెలిపారు. వారిని అక్కడి నుంచి ప్రత్యేక బోట్ల ద్వారా శ్రీశైలానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఘటనతో కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే, పెద్ద డోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలో లైనింగ్ పనులు జరుగుతున్నాయి. బుధవారం కార్మికులు విధుల్లో నిమగ్నమై ఉండగా, ఒక్కసారిగా సొరంగంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో లోపల ఉన్న 200 మంది కార్మికులు బయటకు వచ్చే మార్గం లేక చిక్కుకుపోయారు.
ఈ సమాచారం అందుకున్న ప్రాజెక్టు అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులందరినీ కృష్ణా నది సమీపంలోని కొల్లం వాగు వద్దకు సురక్షితంగా చేర్చారు. వారంతా క్షేమంగా ఉన్నారని వెలిగొండ ప్రాజెక్టు ఈఈ కృష్ణారెడ్డి తెలిపారు. వారిని అక్కడి నుంచి ప్రత్యేక బోట్ల ద్వారా శ్రీశైలానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఘటనతో కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.