మరోసారి బాలయ్య జోడీగా నయనతార?
- బాలయ్యతో గోపీచంద్ మలినేని సినిమా
- గతంలో హిట్ కొట్టిన 'వీరసింహ రెడ్డి'
- నయనతారకి కథ వినిపించినట్టు టాక్
- ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం
తెలుగులో ఆమె చిరంజీవి సరసన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో నయనతార మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక టాక్ షికారు చేస్తోంది. బాలకృష్ణతో 'వీర సింహారెడ్డి' చేసిన గోపీచంద్ మలినేని, ఆయనతో ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాకి సంబంధించిన కథను, చిరంజీవి సినిమా సెట్లోనే గోపీచంద్ మలినేని ఆమెకి వినిపించాడని టాక్. కథ నచ్చడంతో నయనతార ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. అదే నిజమైతే బాలకృష్ణ సరసన ఆమెకి ఇది నాలుగో సినిమా అవుతుంది. గతంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన సింహా .. శ్రీరామరాజ్యం .. జై సింహా విజయాలను సాధించిన సంగతి తెలిసిందే.