Mohammad Yunus: భారత్ను కవ్వించిన బంగ్లాదేశ్.. వివాదాస్పద మ్యాప్ను పాక్ జనరల్కు బహుమతిగా ఇచ్చిన యూనస్
- పాకిస్థాన్ ఆర్మీ ఉన్నతాధికారితో బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత యూనస్ భేటీ
- భారత్ ఈశాన్య రాష్ట్రాలు తమవేనన్నట్టుగా ఉన్న మ్యాప్ను బహుమతిగా అందజేత
- ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ పుస్తకం కవర్పై వివాదాస్పద మ్యాప్ ముద్రణ
- గతంలోనూ ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు
- భారత్తో దెబ్బతింటున్న సంబంధాలు
- చైనా-పాక్లకు దగ్గరవుతున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ మరోసారి భారత్తో దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో అంతర్భాగంగా చూపిస్తున్న ఒక వివాదాస్పద మ్యాప్ను పాకిస్థాన్ ఆర్మీ ఉన్నతాధికారికి ఆయన బహుమతిగా ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ చర్య ద్వారా భారత్ సార్వభౌమత్వాన్ని యూనస్ పరోక్షంగా ప్రశ్నించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా ఢాకాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన యూనస్తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత, యూనస్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిలో, పాక్ జనరల్కు 'ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్' అనే పుస్తకాన్ని బహుమతిగా ఇస్తున్న చిత్రం ఉంది. అయితే, ఆ పుస్తకం ముఖచిత్రంపై ఉన్న మ్యాప్లో భారత్లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంలో కలిపి చూపించారు. ఇది తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలు కోరుతున్న 'గ్రేటర్ బంగ్లాదేశ్' వాదనకు బలం చేకూర్చేలా ఉంది.
ఈ ఫొటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో యూనస్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనవసరంగా భారత్ అంతర్గత విషయాల్లోకి ప్రవేశిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. 1971 విమోచన యుద్ధం తర్వాత చారిత్రాత్మకంగా దెబ్బతిన్న బంగ్లాదేశ్-పాకిస్థాన్ సంబంధాలు, యూనస్ అధికారంలోకి వచ్చాక మెరుగుపడుతున్నాయనడానికి ఈ భేటీ నిదర్శనంగా నిలుస్తోంది.
పదేపదే ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన
యూనస్ భారత్ ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడటం ఇది మొదటిసారి కాదు. గత ఏప్రిల్లో చైనా పర్యటనకు వెళ్లినప్పుడు, "భారత్లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టిత ప్రాంతాలు. సముద్రానికి చేరుకోవడానికి వాటికి మార్గం లేదు. ఆ ప్రాంతానికి సముద్ర సంరక్షకులం మేమే" అని వ్యాఖ్యానించి ఢిల్లీకి ఆగ్రహం తెప్పించారు. చైనా తన ఆర్థిక కార్యకలాపాలను ఈ ప్రాంతంలో విస్తరించుకోవడానికి ఇది మంచి అవకాశమని ఆయన సూచించారు.
యూనస్ వ్యాఖ్యల తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్ వస్తువులు భారత భూభాగం గుండా నేపాల్, భూటాన్లకు వెళ్లేందుకు వీలు కల్పించే రవాణా ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీనికితోడు, యూనస్ సన్నిహితులు కూడా గతంలో 'గ్రేటర్ బంగ్లాదేశ్' మ్యాప్లను సోషల్ మీడియాలో షేర్ చేయడం, భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటివి చేశారు. వరుస ఘటనలపై యూనస్ మౌనంగా ఉండటం, ఇప్పుడు స్వయంగా వివాదాస్పద మ్యాప్ను బహుమతిగా ఇవ్వడం చూస్తుంటే.. చైనా, పాకిస్థాన్ల మద్దతుతో ఈ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలను మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇటీవల పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా ఢాకాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన యూనస్తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత, యూనస్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిలో, పాక్ జనరల్కు 'ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్' అనే పుస్తకాన్ని బహుమతిగా ఇస్తున్న చిత్రం ఉంది. అయితే, ఆ పుస్తకం ముఖచిత్రంపై ఉన్న మ్యాప్లో భారత్లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంలో కలిపి చూపించారు. ఇది తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలు కోరుతున్న 'గ్రేటర్ బంగ్లాదేశ్' వాదనకు బలం చేకూర్చేలా ఉంది.
ఈ ఫొటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో యూనస్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనవసరంగా భారత్ అంతర్గత విషయాల్లోకి ప్రవేశిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. 1971 విమోచన యుద్ధం తర్వాత చారిత్రాత్మకంగా దెబ్బతిన్న బంగ్లాదేశ్-పాకిస్థాన్ సంబంధాలు, యూనస్ అధికారంలోకి వచ్చాక మెరుగుపడుతున్నాయనడానికి ఈ భేటీ నిదర్శనంగా నిలుస్తోంది.
పదేపదే ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన
యూనస్ భారత్ ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడటం ఇది మొదటిసారి కాదు. గత ఏప్రిల్లో చైనా పర్యటనకు వెళ్లినప్పుడు, "భారత్లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టిత ప్రాంతాలు. సముద్రానికి చేరుకోవడానికి వాటికి మార్గం లేదు. ఆ ప్రాంతానికి సముద్ర సంరక్షకులం మేమే" అని వ్యాఖ్యానించి ఢిల్లీకి ఆగ్రహం తెప్పించారు. చైనా తన ఆర్థిక కార్యకలాపాలను ఈ ప్రాంతంలో విస్తరించుకోవడానికి ఇది మంచి అవకాశమని ఆయన సూచించారు.
యూనస్ వ్యాఖ్యల తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్ వస్తువులు భారత భూభాగం గుండా నేపాల్, భూటాన్లకు వెళ్లేందుకు వీలు కల్పించే రవాణా ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీనికితోడు, యూనస్ సన్నిహితులు కూడా గతంలో 'గ్రేటర్ బంగ్లాదేశ్' మ్యాప్లను సోషల్ మీడియాలో షేర్ చేయడం, భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటివి చేశారు. వరుస ఘటనలపై యూనస్ మౌనంగా ఉండటం, ఇప్పుడు స్వయంగా వివాదాస్పద మ్యాప్ను బహుమతిగా ఇవ్వడం చూస్తుంటే.. చైనా, పాకిస్థాన్ల మద్దతుతో ఈ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలను మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.