రాత్రికి రాత్రే వేల కోట్లకు అధిపతిగా మారిన మధ్యప్రదేశ్ వాసి.. నిమిషాల్లోనే అంతా మాయం
- స్కూలు యజమాని డీమ్యాట్ ఖాతాలో 2,817 కోట్ల సంపద
- తన తలరాత మారిపోయిందని సంబరపడ్డ వినోద్ డోంగ్లే
- ప్రపంచంలోని అన్ని లాటరీలు ఒకేసారి గెల్చానని భావించినట్లు వెల్లడి
అప్పటి వరకు ఒక్కో షేరు రూ.2.14 కోట్లు చొప్పున 1,312 షేర్ల విలువ రూ.2,817 కోట్లుగా చూపించగా.. కాసేపటికే ఆ అంకెలన్నీ మాయమై పాత విలువనే చూపించాయి. ఒక్కో షేరు 63 పైసల చొప్పున రూ.826.56 పైసలుగా చూపించింది. హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్ల విషయంలో వినోద్ డోంగ్లేకు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. కాసేపే అయినా అంకెల్లో తను బిలియనీర్ ను అయ్యానని వినోద్ డోంగ్లే సంతోషం వ్యక్తం చేశారు.