'శివ' రీ-రిలీజ్... రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండన్న అల్లు అర్జున్!
- నవంబర్ 14న థియేటర్లలోకి 'శివ' రీ-రిలీజ్
- సినిమాపై వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్
- థియేటర్లకు రెండు లారీల పేపర్లు తీసుకురావాలని ఫ్యాన్స్కు పిలుపు
- భారతీయ సినిమాను మార్చిన చిత్రమన్న బన్నీ
'శివ' రీ-రిలీజ్పై అల్లు అర్జున్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. "తెలుగు సినిమా చరిత్రలో 'శివ' ఒక ఐకానిక్ చిత్రం. ఈ ఒక్క సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాంటి సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుంటే, ఆ సంబరాన్ని గ్రాండ్గా జరుపుకోవాలి. అక్కినేని అభిమానులకు, తెలుగు సినీ ప్రియులకు నాదొక విజ్ఞప్తి. ఈసారి థియేటర్కు వెళ్లేటప్పుడు రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి" అంటూ తనదైన శైలిలో పిలుపునిచ్చారు.