Kurnool bus accident: కర్నూలు బస్సు ప్రమాదంలో తీవ్ర విషాదం... మొత్తం కుటుంబం సజీవదహనం
- కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం.. 11 మంది మృతి
- బస్సు కింద బైక్ ఇరుక్కోవడంతో తెగిపోయిన డోర్ కేబుల్
- నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురి సజీవదహనం
- ఘటన తర్వాత తప్పించుకున్న బస్సు డ్రైవర్
- క్షేమంగా బయటపడిన 20 మంది ప్రయాణికులు
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ సిరి అధికారికంగా ధ్రువీకరించారు. మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు ఉండటం అందరినీ కలచివేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా సజీవ దహనమయ్యారు. ఉపాధి నిమిత్తం బెంగళూరులో స్థిరపడిన రమేష్ కుటుంబం, హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం బలి తీసుకుంది. కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి, ఘటనకు గల కారణాలను మీడియాకు వివరించారు. బస్సు కిందకు ఒక బైక్ దూసుకురావడంతో, డోర్ తెరుచుకోవడానికి ఉపయోగపడే కేబుల్ తెగిపోయిందని తెలిపారు. ఈ ఘటన తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయని, సుమారు 20 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతైందని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశామని, మరో 20 మంది క్షేమంగా బయటపడ్డారని ఆమె వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో కొందరు స్థానికులు మానవత్వం చాటుకున్నారు. హిందూపుర్కు చెందిన నవీన్ అనే వ్యక్తి తన కారులో ఆరుగురు క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా, పుట్టపర్తి నుంచి వస్తున్న హైమరెడ్డి అనే మహిళ బస్సులో మంటలు రావడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా సజీవ దహనమయ్యారు. ఉపాధి నిమిత్తం బెంగళూరులో స్థిరపడిన రమేష్ కుటుంబం, హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం బలి తీసుకుంది. కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి, ఘటనకు గల కారణాలను మీడియాకు వివరించారు. బస్సు కిందకు ఒక బైక్ దూసుకురావడంతో, డోర్ తెరుచుకోవడానికి ఉపయోగపడే కేబుల్ తెగిపోయిందని తెలిపారు. ఈ ఘటన తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయని, సుమారు 20 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతైందని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశామని, మరో 20 మంది క్షేమంగా బయటపడ్డారని ఆమె వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో కొందరు స్థానికులు మానవత్వం చాటుకున్నారు. హిందూపుర్కు చెందిన నవీన్ అనే వ్యక్తి తన కారులో ఆరుగురు క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా, పుట్టపర్తి నుంచి వస్తున్న హైమరెడ్డి అనే మహిళ బస్సులో మంటలు రావడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.