సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత లేఖ
- గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత లేఖ
- నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆరోపణ
- ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని సీజేఐకి విజ్ఞప్తి
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని కవిత తన లేఖ ద్వారా సీజేఐని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లోని శిల్పకళావేదికలో 562 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసిన నేపథ్యంలో కవిత ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది.
గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు కవిత వెల్లడించారు. ప్రశ్నాపత్రాల అనువాదంలో (ట్రాన్స్లేషన్) లోపాల వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సమాధాన పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, దీంతో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు వచ్చాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆమె తెలిపారు.
అంతేకాకుండా, ప్రిలిమ్స్ పరీక్షకు ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ పరీక్షకు మరో హాల్ టికెట్ నంబర్ కేటాయించడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపి, గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.