KTR: వచ్చే నెలలో కొలంబోకు వెళుతున్న కేటీఆర్

KTR to Attend Global Economic and Technology Summit in Colombo
  • కొలంబోలో గ్లోబల్ టెక్ సదస్సులో పాల్గొననున్న మాజీ మంత్రి
  • కీలక ప్రసంగం చేయాల్సిందిగా శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆహ్వానం
  • నవంబర్ 10 నుంచి 12 వరకు సదస్సు నిర్వహణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అంతర్జాతీయ వేదిక నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్-2025’లో కీలక ప్రసంగం చేయాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ మేరకు శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున శ్రీలంక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏయూఎల్ఏ హిల్మీ ఇటీవలే కేటీఆర్‌కు ఆహ్వాన పత్రం పంపారు.

నవంబర్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబోలోని ‘ది కింగ్స్‌బరీ హోటల్‌’లో ఈ సదస్సు జరగనుంది. కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలకు చెందిన విధాన రూపకర్తలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు, అగ్రశ్రేణి నాయకులు పాల్గొననున్నారు. ఇలాంటి కీలకమైన సదస్సులో ప్రసంగించేందుకు కేటీఆర్‌కు ఆహ్వానం లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నవంబర్ 10న శ్రీలంకకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
KTR
KTR Global Economic and Technology Summit
Global Economic and Technology Summit 2025
Colombo
Sri Lanka
BRS Party
Digital Transformation
Technology Summit
Innovation

More Telugu News