Delhi Public School: మంటలు అంటుకుని దగ్ధమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు
- నాదర్గుల్లో స్కూల్ బస్సులో మంటలు
- అప్రమత్తమై బస్సు దిగిపోయిన డ్రైవర్
- విద్యార్థులను ఇళ్ల వద్ద దింపి వెళుతుండగా ఘటన
హైదరాబాద్లోని నాదర్గుల్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు నుండి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపి దిగిపోయారు. ఆ తరువాత బస్సు పూర్తిగా కాలిపోయింది. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపి తిరిగి వస్తుండగా కాటేదాన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సమయానికి బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సమయానికి బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.