Malepati Subba Naidu: టీడీపీ ఉపాధ్యక్షుడు మాలేపాటి కుటుంబంలో తీవ్ర విషాదం.. 24 గంటల వ్యవధిలో బాబాయి, అబ్బాయి కన్నుమూత!
- టీడీపీ సీనియర్ నేత, ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కన్నుమూత
- అన్న కుమారుడు మరణించిన 24 గంటలలోపే అస్తమయం
- సుబ్బానాయుడి మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి
- విశ్వసనీయ సహచరుడిని కోల్పోయానంటూ ఆవేదన
- ఆయన కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని హామీ
తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కన్నుమూశారు. శనివారం రాత్రి ఆయన అన్న కుమారుడు మాలేపాటి భాను మరణించగా, ఆ ఘటన జరిగిన 24 గంటలు కూడా గడవక ముందే సుబ్బానాయుడు తుదిశ్వాస విడవడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఈ జంట మరణాలతో మాలేపాటి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
సుబ్బానాయుడి మరణవార్తపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన అత్యంత ఆప్త మిత్రుడిని, విశ్వసనీయ సహచరుడిని కోల్పోయానని తీవ్ర ఆవేదన చెందారు. "ఇటీవలే ఆసుపత్రిలో సుబ్బానాయుడిని కలిసి పరామర్శించాను. ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశించాను. కానీ, ఆయన అకాలమరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను" అని మంత్రి పేర్కొన్నారు.
సుబ్బానాయుడు పార్టీ పట్ల చూపిన నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలన్న ఆయన తపన అందరికీ ఆదర్శమని అచ్చెన్నాయుడు కొనియాడారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని గుర్తుచేసుకున్నారు. "సుబ్బానాయుడు గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు. తన సాదాసీదా జీవన శైలితో అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో చిత్తశుద్ధితో పనిచేసేవారు. ఆయన సేవా స్పూర్తి ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని వివరించారు.
ఈ కష్టకాలంలో సుబ్బానాయుడు కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తాయని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
సుబ్బానాయుడి మరణవార్తపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన అత్యంత ఆప్త మిత్రుడిని, విశ్వసనీయ సహచరుడిని కోల్పోయానని తీవ్ర ఆవేదన చెందారు. "ఇటీవలే ఆసుపత్రిలో సుబ్బానాయుడిని కలిసి పరామర్శించాను. ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశించాను. కానీ, ఆయన అకాలమరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను" అని మంత్రి పేర్కొన్నారు.
సుబ్బానాయుడు పార్టీ పట్ల చూపిన నిబద్ధత, ప్రజలకు సేవ చేయాలన్న ఆయన తపన అందరికీ ఆదర్శమని అచ్చెన్నాయుడు కొనియాడారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని గుర్తుచేసుకున్నారు. "సుబ్బానాయుడు గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు. తన సాదాసీదా జీవన శైలితో అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో చిత్తశుద్ధితో పనిచేసేవారు. ఆయన సేవా స్పూర్తి ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని వివరించారు.
ఈ కష్టకాలంలో సుబ్బానాయుడు కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తాయని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.