MITS Group: దీపావళి కానుకంటే ఇది.. 51 మంది ఉద్యోగులకు లగ్జరీ కార్లు పంచిన ఓనర్!
- చండీగఢ్లో ఫార్మా కంపెనీ యజమాని ఉదారత
- ఉద్యోగులకు 51 స్కార్పియో కార్లు దీపావళి కానుక
- ఎంఐటీఎస్ గ్రూప్ ఛైర్మన్ ఎంకే భాటియా ఈ కానుకలు అందజేత
- ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రోత్సాహకం
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల ప్రశంసలు
పండుగ పూట ఉద్యోగులకు బోనస్లు, బహుమతులు ఇవ్వడం సాధారణమే. కానీ, చండీగఢ్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ యజమాని ఒక అడుగు ముందుకేసి తన సిబ్బందికి ఏకంగా 51 లగ్జరీ కార్లను దీపావళి కానుకగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎంఐటీఎస్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన ఎంకే భాటియా తన కంపెనీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఖరీదైన స్కార్పియో ఎస్యూవీ కార్ల తాళాలను స్వయంగా అందజేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం, ఎంఐటీఎస్ గ్రూప్ తమ చండీగఢ్ కేంద్రంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను గుర్తించి వారికి ఈ కార్లను బహుమతిగా అందించారు. గతంలో కూడా పండుగల సమయంలో భాటియా తన సిబ్బందికి ఇలాంటి విలువైన బహుమతులు ఇవ్వడం గమనార్హం. ఉద్యోగుల పట్ల ఆయనకున్న కృతజ్ఞతాభావానికి ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉద్యోగుల పట్ల ఇంతటి ఔదార్యం చూపించడం వెనుక ఎంకే భాటియా వ్యక్తిగత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూసి, 2002లో తన మెడికల్ స్టోర్ మూతపడటంతో దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నారు. ఆ తర్వాత పట్టుదలతో 2015లో ఎంఐటీఎస్ గ్రూప్ను స్థాపించి, అనతికాలంలోనే విజయవంతమయ్యారు. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో 12 కంపెనీలు నడుస్తున్నాయి.
భారత్లోని వివిధ రాష్ట్రాలతో పాటు కెనడా, లండన్, దుబాయ్ వంటి దేశాలకు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు భాటియా గతంలోనే తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు భాటియా మంచి మనసును ప్రశంసిస్తుండగా, మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కార్ల ఈఎంఐలను ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేస్తారేమో? అంటూ కొందరు కామెంట్లు చేశారు. ఏదేమైనా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న కంపెనీల జాబితాలో ఎంఐటీఎస్ గ్రూప్ చేరిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం, ఎంఐటీఎస్ గ్రూప్ తమ చండీగఢ్ కేంద్రంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను గుర్తించి వారికి ఈ కార్లను బహుమతిగా అందించారు. గతంలో కూడా పండుగల సమయంలో భాటియా తన సిబ్బందికి ఇలాంటి విలువైన బహుమతులు ఇవ్వడం గమనార్హం. ఉద్యోగుల పట్ల ఆయనకున్న కృతజ్ఞతాభావానికి ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉద్యోగుల పట్ల ఇంతటి ఔదార్యం చూపించడం వెనుక ఎంకే భాటియా వ్యక్తిగత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూసి, 2002లో తన మెడికల్ స్టోర్ మూతపడటంతో దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నారు. ఆ తర్వాత పట్టుదలతో 2015లో ఎంఐటీఎస్ గ్రూప్ను స్థాపించి, అనతికాలంలోనే విజయవంతమయ్యారు. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో 12 కంపెనీలు నడుస్తున్నాయి.
భారత్లోని వివిధ రాష్ట్రాలతో పాటు కెనడా, లండన్, దుబాయ్ వంటి దేశాలకు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు భాటియా గతంలోనే తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు భాటియా మంచి మనసును ప్రశంసిస్తుండగా, మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కార్ల ఈఎంఐలను ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేస్తారేమో? అంటూ కొందరు కామెంట్లు చేశారు. ఏదేమైనా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న కంపెనీల జాబితాలో ఎంఐటీఎస్ గ్రూప్ చేరిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.