పండుగవేళ బంద్ తో ప్రయాణికులకు ఇక్కట్లు.. క్యాబ్ డ్రైవర్ల నిలువుదోపిడి
- దొరికిందే ఛాన్సని దండుకుంటున్న క్యాబ్ లు
- ఉప్పల్ నుంచి హనుమకొండకు రూ.700 వసూలు
- డిపోలకే పరిమితమైన బస్సులు.. బస్టాండ్లలో జనం పడిగాపులు
- పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి తప్పని ఇక్కట్లు
సాధారణ రోజుల్లో ఉప్పల్ నుంచి హనుమకొండకు రూ.300 తీసుకునే క్యాబ్ డ్రైవర్లు.. ఇప్పుడు మాత్రం రూ.700 వసూలు చేస్తున్నారు. దీంతో దీపావళి పండుగకు సొంతూరు వెళ్లే ప్రయాణికులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. మరోవైపు, జూబ్లీ బస్ స్టేషన్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సోమవారం దీపావళి పండుగ నేపథ్యంలో వారాంతపు సెలవులు కూడా కలిసి వచ్చాయని ఊరు వెళ్లేందుకు బస్టాండ్ కు చేరుకున్న జనం బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బంద్ పై ముందస్తు సమాచారం లేక బస్ స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వయోవృద్ధులు, మహిళలతో గంటల తరబడి ఎదురుచూస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.