Mohammed Ahmed: రష్యా సైన్యంలో హైదరాబాద్ వాసి.. విడిపించేందుకు రంగంలోకి దిగిన కేంద్రం
- ఉద్యోగ మోసంతో రష్యా సైన్యంలో చిక్కుకున్న హైదరాబాదీ మహమ్మద్ అహ్మద్
- రష్యా నుంచి వీడియో పంపి తనను కాపాడాలంటూ బాధితుడి వేడుకోలు
- విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- స్పందించిన భారత రాయబార కార్యాలయం.. రష్యా అధికారులతో సంప్రదింపులు
ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన ఓ హైదరాబాదీ, ఏజెంట్ చేతిలో మోసపోయి ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధరంగంలో చిక్కుకుపోయాడు. తనను ఎలాగైనా కాపాడాలంటూ అతను పంపిన వీడియో సందేశం కలకలం రేపడంతో, భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. బాధితుడిని సైన్యం నుంచి సురక్షితంగా విడిపించి స్వదేశానికి రప్పించేందుకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రష్యా అధికారులతో సంప్రదింపులు ప్రారంభించింది.
అసలేం జరిగిందంటే..!
హైదరాబాద్లోని ఖైరతాబాద్కు చెందిన 37 ఏళ్ల మహమ్మద్ అహ్మద్, ముంబైకి చెందిన ఓ ఏజెంట్ మాటలు నమ్మి నిర్మాణ రంగంలో ఉద్యోగం కోసం ఏప్రిల్ 25న రష్యా వెళ్లాడు. అయితే, అక్కడికి వెళ్లాక అతడిని మోసగించి, బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారు. ఆయుధ శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ సరిహద్దుకు పంపించారు. అక్కడ ఎదుర్కొంటున్న నరకయాతనను వివరిస్తూ, తనను కాపాడాలంటూ అహ్మద్ తన కుటుంబానికి ఇటీవల ఒక వీడియో సందేశం పంపాడు.
ఈ విషయం తెలుసుకున్న అహ్మద్ భార్య అఫ్షా బేగం, ఇతర కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఆశ్రయించారు. ఒవైసీ ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో అధికార యంత్రాంగం కదిలింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి, అహ్మద్ వివరాలను రష్యా అధికారులకు అందజేసింది. అతడిని వెంటనే సైన్యం నుంచి విడుదల చేసి, సురక్షితంగా భారత్కు పంపాలని అధికారికంగా అభ్యర్థించింది. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయ కౌన్సిలర్, ఎంపీ ఒవైసీకి తెలియజేశారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న అహ్మద్ ఆవేదన
"నాతో పాటు 25 మందిని ఇక్కడికి తీసుకొచ్చారు. వారిలో 17 మంది ఇప్పటికే చనిపోయారు. వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. యుద్ధం చేయడానికి నేను, మరో ముగ్గురు భారతీయులం నిరాకరించగా.. తుపాకులతో బెదిరించారు. నా కాలికి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఉన్నాను. అయినా రేపు యుద్ధానికి వెళ్లమంటున్నారు" అంటూ అహ్మద్ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యాడు. తన ఈ దుస్థితికి కారణమైన ఏజెంట్ను కఠినంగా శిక్షించాలని అతను వేడుకున్నాడు.
గతేడాది కూడా ఇలాగే దుబాయ్ ఏజెంట్ చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చేరిన హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అస్ఫాన్ అనే యువకుడు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అహ్మద్ ఉదంతం వెలుగులోకి రావడంతో ఉద్యోగం పేరుతో అమాయకులను యుద్ధంలోకి పంపుతున్న ఏజెంట్ల మోసాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
అసలేం జరిగిందంటే..!
హైదరాబాద్లోని ఖైరతాబాద్కు చెందిన 37 ఏళ్ల మహమ్మద్ అహ్మద్, ముంబైకి చెందిన ఓ ఏజెంట్ మాటలు నమ్మి నిర్మాణ రంగంలో ఉద్యోగం కోసం ఏప్రిల్ 25న రష్యా వెళ్లాడు. అయితే, అక్కడికి వెళ్లాక అతడిని మోసగించి, బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారు. ఆయుధ శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ సరిహద్దుకు పంపించారు. అక్కడ ఎదుర్కొంటున్న నరకయాతనను వివరిస్తూ, తనను కాపాడాలంటూ అహ్మద్ తన కుటుంబానికి ఇటీవల ఒక వీడియో సందేశం పంపాడు.
ఈ విషయం తెలుసుకున్న అహ్మద్ భార్య అఫ్షా బేగం, ఇతర కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఆశ్రయించారు. ఒవైసీ ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో అధికార యంత్రాంగం కదిలింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి, అహ్మద్ వివరాలను రష్యా అధికారులకు అందజేసింది. అతడిని వెంటనే సైన్యం నుంచి విడుదల చేసి, సురక్షితంగా భారత్కు పంపాలని అధికారికంగా అభ్యర్థించింది. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయ కౌన్సిలర్, ఎంపీ ఒవైసీకి తెలియజేశారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న అహ్మద్ ఆవేదన
"నాతో పాటు 25 మందిని ఇక్కడికి తీసుకొచ్చారు. వారిలో 17 మంది ఇప్పటికే చనిపోయారు. వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. యుద్ధం చేయడానికి నేను, మరో ముగ్గురు భారతీయులం నిరాకరించగా.. తుపాకులతో బెదిరించారు. నా కాలికి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఉన్నాను. అయినా రేపు యుద్ధానికి వెళ్లమంటున్నారు" అంటూ అహ్మద్ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యాడు. తన ఈ దుస్థితికి కారణమైన ఏజెంట్ను కఠినంగా శిక్షించాలని అతను వేడుకున్నాడు.
గతేడాది కూడా ఇలాగే దుబాయ్ ఏజెంట్ చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చేరిన హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అస్ఫాన్ అనే యువకుడు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అహ్మద్ ఉదంతం వెలుగులోకి రావడంతో ఉద్యోగం పేరుతో అమాయకులను యుద్ధంలోకి పంపుతున్న ఏజెంట్ల మోసాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.