Diwali: దీపావళి వేళ.. విమానయాన సంస్థల ఆఫర్ల జాతర
- ఆకాశ ఎయిర్ టికెట్లపై 20 శాతం వరకు డిస్కౌంట్
- ఇండిగోలో రూ.2,390కే దేశీయ విమాన ప్రయాణం
- విదేశీ ప్రయాణాలపై ఖతార్ ఎయిర్వేస్ 25 శాతం తగ్గింపు
- పండగ రద్దీ దృష్ట్యా ఎయిర్ ఇండియా, స్పైస్జెట్ ప్రత్యేక సర్వీసులు
దీపావళి పండగ సీజన్ సమీపిస్తుండటంతో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. సొంతూళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య అధికమవడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు విమానయాన సంస్థలు పోటీ పడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. టికెట్లపై భారీ డిస్కౌంట్లు, అదనపు సర్వీసులతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ దీపావళి సందర్భంగా ప్రయాణికుల కోసం పలు ఆఫర్లను ప్రకటించింది. విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. 'AKASA20' అనే వోచర్ కోడ్ ఉపయోగించి ఈ డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. అంతేకాకుండా, ఎంపిక చేసిన సీట్లపై 30 శాతం, అదనపు లగేజీపై 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31 వరకు విమానాల్లో ప్రత్యేక దీపావళి భోజనాన్ని కూడా అందిస్తుండటం విశేషం.
మరోవైపు, ఇండిగో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ నేటితో ముగియనుంది. దీని కింద దేశీయ ప్రయాణాలకు టికెట్ ధరలు రూ.2,390 నుంచి, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.8,990 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. 2025 నవంబర్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ఎయిర్వేస్ కూడా దీపావళి ఆఫర్ను ప్రకటించింది. భారత్లోని 13 నగరాల నుంచి అమెరికా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు వెళ్లే టికెట్లపై 25 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అక్టోబర్ 23 లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారు 2026 మార్చి 31 వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది.
రద్దీకి అనుగుణంగా అదనపు విమానాలు
పండగ రద్దీని తట్టుకునేందుకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్జెట్ సంస్థలు అదనపు సర్వీసులను నడుపుతున్నాయి. ఎయిర్ ఇండియా.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి పాట్నాకు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 2 వరకు 38 అదనపు విమానాలను నడుపుతోంది. అటు స్పైస్జెట్ కూడా అయోధ్యకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక నాన్-స్టాప్ విమానాలను ఏర్పాటు చేసింది.
ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ దీపావళి సందర్భంగా ప్రయాణికుల కోసం పలు ఆఫర్లను ప్రకటించింది. విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. 'AKASA20' అనే వోచర్ కోడ్ ఉపయోగించి ఈ డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. అంతేకాకుండా, ఎంపిక చేసిన సీట్లపై 30 శాతం, అదనపు లగేజీపై 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31 వరకు విమానాల్లో ప్రత్యేక దీపావళి భోజనాన్ని కూడా అందిస్తుండటం విశేషం.
మరోవైపు, ఇండిగో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ నేటితో ముగియనుంది. దీని కింద దేశీయ ప్రయాణాలకు టికెట్ ధరలు రూ.2,390 నుంచి, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.8,990 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. 2025 నవంబర్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ఎయిర్వేస్ కూడా దీపావళి ఆఫర్ను ప్రకటించింది. భారత్లోని 13 నగరాల నుంచి అమెరికా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు వెళ్లే టికెట్లపై 25 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అక్టోబర్ 23 లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారు 2026 మార్చి 31 వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది.
రద్దీకి అనుగుణంగా అదనపు విమానాలు
పండగ రద్దీని తట్టుకునేందుకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్జెట్ సంస్థలు అదనపు సర్వీసులను నడుపుతున్నాయి. ఎయిర్ ఇండియా.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి పాట్నాకు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 2 వరకు 38 అదనపు విమానాలను నడుపుతోంది. అటు స్పైస్జెట్ కూడా అయోధ్యకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక నాన్-స్టాప్ విమానాలను ఏర్పాటు చేసింది.