Donald Trump: పాక్ నుంచి ట్రంప్ కుమారుడికి డబ్బు ముడుతోంది.. అమెరికా మాజీ రాయబారి
- ఆ డబ్బు కోసమే భారత్ తో అమెరికా బంధాన్ని తెంచేస్తున్నాడని ఆరోపణ
- 40 ఏళ్ల దౌత్య సంబంధాలను వదులుకున్నాడని ఫైర్
- చైనాను ఎదుర్కోవడంలో అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి భారత్
40 సంవత్సరాలుగా భారత్ తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అగ్రరాజ్యానికి చెందిన మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయేల్ పేర్కొన్నారు. ఈ కీలకమైన భాగస్వామ్యాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అహంభావంతో, తన స్వార్థం కోసం చెడగొడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కుమారుడికి పాకిస్థాన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ముడుతోందని ఆరోపిస్తూ.. ఈ డబ్బు కోసమే ట్రంప్ భారత్ పై కక్ష కట్టారని పేర్కొన్నారు. తన స్వార్థం కోసం అమెరికా ప్రయోజనాలను కూడా పక్కన పెడుతున్నారని విమర్శించారు.
చైనాను ఎదుర్కోవడంలో అమెరికాకు అత్యంత కీలకమైన, నమ్మకమైన భాగస్వామి భారతదేశమేనని ఇమాన్యుయేల్ చెప్పారు. ఆ విషయాన్ని గుర్తించకుండా అధ్యక్షుడు ట్రంప్ అహం చూపిస్తున్నారు. భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది తానేనని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చడమూ ఓ కారణమేనని చెప్పారు. కాగా, రహమ్ ఇమాన్యుయేల్ గతంలో జపాన్ కు అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమెరికా, భారత్ సంబంధాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనాను ఎదుర్కోవడంలో అమెరికాకు అత్యంత కీలకమైన, నమ్మకమైన భాగస్వామి భారతదేశమేనని ఇమాన్యుయేల్ చెప్పారు. ఆ విషయాన్ని గుర్తించకుండా అధ్యక్షుడు ట్రంప్ అహం చూపిస్తున్నారు. భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది తానేనని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చడమూ ఓ కారణమేనని చెప్పారు. కాగా, రహమ్ ఇమాన్యుయేల్ గతంలో జపాన్ కు అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమెరికా, భారత్ సంబంధాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.