రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం.. గుంటూరులో దారుణం
- బోగీలో ఒంటరిగా ఉన్న తనను కత్తితో బెదిరించి రేప్ చేశాడని వెల్లడి
- గుంటూరు, పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య ఘటన
- చర్లపల్లి చేరుకున్నాక రైల్వే పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
రైలు గుంటూరు దాటిన తర్వాత ఆ బోగీలో తను తప్ప ఎవరూ లేరని, ఇంతలోనే 40 సంవత్సరాల వయస్సున్న దుండగుడు బోగీలోకి వచ్చాడని తెలిపింది. తాను ఒంటరిగా ఉండడాన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు.. కత్తితో బెదిరించి తనపై అఘాయిత్యం చేశాడని తెలిపింది. రైలు గుంటూరు, పెద్దకూరపాడు మధ్య ప్రయాణిస్తుండగా ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పింది. అనంతరం, తన హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్ లాక్కుని పెద్దకూరపాడు స్టేషన్ లో రైలు ఆగగానే దిగిపోయాడని తెలిపింది. చర్లపల్లికి చేరుకున్నాక బాధితురాలు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.