Donald Trump: పాక్ ప్రధాని ముందే ‘ఇండియా గ్రేట్ కంట్రీ’ అంటూ ట్రంప్ పొగడ్తలు
- భారత్, పాక్ సామరస్యంగా కలిసి ఉంటాయని భావిస్తున్నానని వ్యాఖ్య
- ఈజిప్టులో జరిగిన పీస్ సదస్సు వేదికపై ట్రంప్ ప్రసంగం
- కలిసి ఉంటారు కదా? అంటూ వెనకే ఉన్న షెహబాజ్ ను ప్రశ్నించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై పొగడ్తలు కురిపించారు. ఇండియా చాలా గొప్ప దేశమని, తన స్నేహితుడు అక్కడ ఉన్నత పదవిలో ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈజిప్ట్ లో జరిగిన పీస్ సమ్మిట్ లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమిట్ కు ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ప్రతినిధులు హాజరయ్యారు. ట్రంప్ వెనకే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో భాగంగా భారత్ ను పొగడడంతో పాటు ఇండియా, పాక్ సామరస్యంగా కలిసి ఉంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా తన వెనకే ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను ఇదే విషయమై అక్కడికక్కడే ప్రశ్నించారు.
భారత్ తో గొడవ పడకుండా కలిసి ఉంటారు కదా? అని అడగగా షెహబాజ్ షరీఫ్ కు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే అన్నట్లు నవ్వుతూ తలూపడం కనిపించింది. అమెరికా అధ్యక్షుడి ప్రసంగం పూర్తైన తర్వాత మైక్ ముందుకు వచ్చిన షెహబాజ్ షరీఫ్.. ట్రంప్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
ట్రంప్ ను శాంతిదూతగా అభివర్ణిస్తూ.. భారత్, పాక్ ల మధ్య అణు యుద్ధం జరగకుండా ట్రంప్ ఆపారని చెప్పారు. ఆ నాలుగు రోజుల (భారత్, పాక్ ల మధ్య ఘర్షణ జరిగిన) లో ట్రంప్ కనుక జోక్యం చేసుకోకుంటే ఏం జరిగిందనేది చెప్పడానికీ ఎవరూ మిగిలి ఉండే వారు కాదని షెహబాజ్ పేర్కొన్నారు. పాక్ ప్రధాని పొగడ్తలతో ట్రంప్ ఇక మాట్లాడేందుకు ఏమీలేదని, ఇంటికి వెళ్లిపోదామంటూ మైక్ లో చమత్కరించారు.
భారత్ తో గొడవ పడకుండా కలిసి ఉంటారు కదా? అని అడగగా షెహబాజ్ షరీఫ్ కు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే అన్నట్లు నవ్వుతూ తలూపడం కనిపించింది. అమెరికా అధ్యక్షుడి ప్రసంగం పూర్తైన తర్వాత మైక్ ముందుకు వచ్చిన షెహబాజ్ షరీఫ్.. ట్రంప్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
ట్రంప్ ను శాంతిదూతగా అభివర్ణిస్తూ.. భారత్, పాక్ ల మధ్య అణు యుద్ధం జరగకుండా ట్రంప్ ఆపారని చెప్పారు. ఆ నాలుగు రోజుల (భారత్, పాక్ ల మధ్య ఘర్షణ జరిగిన) లో ట్రంప్ కనుక జోక్యం చేసుకోకుంటే ఏం జరిగిందనేది చెప్పడానికీ ఎవరూ మిగిలి ఉండే వారు కాదని షెహబాజ్ పేర్కొన్నారు. పాక్ ప్రధాని పొగడ్తలతో ట్రంప్ ఇక మాట్లాడేందుకు ఏమీలేదని, ఇంటికి వెళ్లిపోదామంటూ మైక్ లో చమత్కరించారు.