సాదాసీదాగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టాటా క్యాపిటల్
- ఒక శాతం ప్రీమియంతో మార్కెట్లో అరంగేట్రం
- ఒక్కో షేరు ధరను రూ.310- 326 గా ఇష్యూ చేసిన కంపెనీ
- బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో రూ.330 వద్ద ట్రేడింగ్
2007లో వాణిజ్య సేవలను ప్రారంభించిన టాటా క్యాపిటల్.. వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు, కార్పొరేట్లకు రుణాలు అందిస్తోంది. 2025 మార్చి 31 వరకు టాటా క్యాపిటల్ కంపెనీ కస్టమర్ల సంఖ్య 70 లక్షలకు చేరింది. ఈ క్రమంలోనే టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.
ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను టైర్-1 క్యాపిటల్ బేస్ను బలోపేతం చేయడానికి, భవిష్యత్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టాటా క్యాపిటల్ రూ.3,655 కోట్లు, అంతకుముందు ఏడాది రూ.3,327 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం కూడా రూ.18,175 కోట్ల నుంచి రూ.28,313 కోట్లకు పెరిగింది.