Gold Price: ఈరోజు కూడా పెరిగిన బంగారం, వెండి ధరలు... ఆల్-టైమ్ రికార్డు
- కొత్త రికార్డు సృష్టించిన బంగారం ధర
- తులం బంగారం రూ. 1.25 లక్షల మార్కును దాటిన వైనం
- ఒక్కరోజే కిలో వెండిపై రూ. 5,000 పెరుగుదల
బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తూ సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా లక్షా 25 వేల రూపాయల మైలురాయిని దాటి ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. గత పది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర, సోమవారం కూడా అదే జోరును కొనసాగించింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెట్టడం మార్కెట్లో కలకలం రేపుతోంది.
బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం, సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 320 పెరిగి, తుది ధర రూ. 1,25,400కు చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల పసిడిపై రూ. 300 పెరగడంతో దాని ధర రూ. 1,14,950గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి.
మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 పెరగడంతో, తెలుగు రాష్ట్రాల్లో దాని ధర రూ. 1,95,000కు చేరింది. పండుగలు, శుభకార్యాలతో సంబంధం లేకుండా ధరలు వరుసగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత మార్కెట్ సరళిని బట్టి చూస్తే, సమీప భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం, సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 320 పెరిగి, తుది ధర రూ. 1,25,400కు చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల పసిడిపై రూ. 300 పెరగడంతో దాని ధర రూ. 1,14,950గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి.
మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 పెరగడంతో, తెలుగు రాష్ట్రాల్లో దాని ధర రూ. 1,95,000కు చేరింది. పండుగలు, శుభకార్యాలతో సంబంధం లేకుండా ధరలు వరుసగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత మార్కెట్ సరళిని బట్టి చూస్తే, సమీప భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.