Rajasthan school rape case: రాజస్థాన్లో దారుణం.. స్కూల్ టాయిలెట్లో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి
- స్కూల్ గోడ దూకి వచ్చి బాత్రూంలో దాక్కున్న నిందితుడు
- అఘాయిత్యానికి పాల్పడి మళ్లీ గోడ దూకి పరారీ
- పాఠశాల సమీపంలో నివసించే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్
రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ పాఠశాలలో ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పాఠశాల టాయిలెట్లో దాక్కున్న ఓ దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు పాఠశాల ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాడు. నేరుగా టాయిలెట్లోకి వెళ్లి అక్కడ దాక్కున్నాడు. కాసేపటికి బాత్రూంకి వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడి, వచ్చిన దారిలోనే గోడ దూకి పారిపోయాడు. భయంతో వణికిపోయిన ఆ చిన్నారి, జరిగిన దారుణాన్ని టీచర్లకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంతో పాటు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పాఠశాల గోడ సమీపంలో నివసించే ఓ వ్యక్తిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.
ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ "రాజధానిలోని పాఠశాలలోనే బాలికలకు రక్షణ లేకపోతే, ఇక ఎక్కడ ఉంటుంది? మహిళలు, బాలికలకు భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది" అని విమర్శించారు. ప్రతిపక్ష నేత టికా రామ్ జుల్లీ స్పందిస్తూ "రాజస్థాన్లో ఏం జరుగుతోంది? ఇలాంటి నేరాలు తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు పాఠశాల ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాడు. నేరుగా టాయిలెట్లోకి వెళ్లి అక్కడ దాక్కున్నాడు. కాసేపటికి బాత్రూంకి వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడి, వచ్చిన దారిలోనే గోడ దూకి పారిపోయాడు. భయంతో వణికిపోయిన ఆ చిన్నారి, జరిగిన దారుణాన్ని టీచర్లకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంతో పాటు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పాఠశాల గోడ సమీపంలో నివసించే ఓ వ్యక్తిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.
ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ "రాజధానిలోని పాఠశాలలోనే బాలికలకు రక్షణ లేకపోతే, ఇక ఎక్కడ ఉంటుంది? మహిళలు, బాలికలకు భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది" అని విమర్శించారు. ప్రతిపక్ష నేత టికా రామ్ జుల్లీ స్పందిస్తూ "రాజస్థాన్లో ఏం జరుగుతోంది? ఇలాంటి నేరాలు తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.