విశాఖలో వరల్డ్ కప్ మ్యాచ్... స్టేడియంలో సందడి చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్
- విశాఖలో టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్
- హాజరైన మంత్రి లోకేశ్, జై షా
- స్టేడియం గ్యాలరీకి మిథాలీ రాజ్ పేరు నామకరణం
- స్టేడియం మూడో గేటుకు రావి కల్పన పేరు
- ఐసీసీ మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ వేళ ఈ కార్యక్రమం
- పాల్గొన్న బీసీసీఐ నూతన అధ్యక్షుడు, ఏసీఏ పెద్దలు
- మహిళా దిగ్గజాలను గౌరవించడమే లక్ష్యమన్న ఏసీఏ
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ పేరును స్టేడియంలోని ‘ఏ-గ్యాలరీ’కి నామకరణం చేశారు. అదేవిధంగా, స్టేడియంలోని మూడో నంబర్ గేటుకు మాజీ వికెట్ కీపర్ రావి కల్పన పేరును పెట్టారు. మంత్రి లోకేశ్, జై షా ఈ నామకరణ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మిథున్ మన్హాస్తో పాటు, ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మాట్లాడారు. మహిళా క్రికెట్కు ఎనలేని సేవలు అందించిన మిథాలీ రాజ్, రావి కల్పన వంటి దిగ్గజాలను గౌరవించుకోవడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. ఆంధ్రా క్రికెట్ సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్రీడాభిమానులు స్వాగతిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.




