నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు... "మై డియర్ భు" అంటూ సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu praises Nara Bhuvaneswari on IOD award
  • నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక ఐఓడీ ఫెలోషిప్ అవార్డు
  • 2025 సంవత్సరానికి గాను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక
  • సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
  • ఆమె నా వెనుక కాదు, నా కంటే ఎంతో ముందుందంటూ ప్రశంస
  • భువనేశ్వరి అంకితభావం, నిజాయతీ తనకు స్ఫూర్తి అని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఒక ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు. వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తున్న ఆమెకు 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు- 2025' లభించింది. ఈ ప్రత్యేక సందర్భంలో సీఎం చంద్రబాబు తన అర్ధాంగిని అభినందిస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రేమపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ పురస్కారం లభించడం పట్ల చంద్రబాబు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "మై డియర్ భు (భువనేశ్వరి), ఐఓడీ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025 అందుకున్న నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నీ అంకితభావం, నిజాయతీ, మౌనంగా ఉండే నీ బలం చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

అంతేకాకుండా, తన విజయంలో భార్య పాత్రను కొనియాడుతూ చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "విజయం సాధించిన ప్రతి పురుషుడి వెనుక ఒక బలమైన మహిళ ఉంటుందని అందరూ అంటుంటారు. కానీ నా విషయంలో మాత్రం నువ్వు నా వెనుక లేవు, నా కంటే ఎన్నో మైళ్ల ముందున్నావు. నాకంటే ముందే అవార్డులు అందుకుంటున్నావు" అంటూ భార్యపై తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు. 

ఈ సందర్భంగా తన అర్ధాంగికి వచ్చిన అవార్డు తాలూకు పత్రాన్ని కూడా చంద్రబాబు తన ట్వీట్ లో పంచుకున్నారు. 
Go Back to Shorts
Nara Bhuvaneswari
Chandrababu Naidu
IOD Distinguished Fellowship Award 2025
Institute of Directors
Andhra Pradesh
Business woman award
Nara Bhuvaneswari award
Telugu news

More Telugu News