తిరుపతిలో ఫ్లైఓవర్ పైనుంచి పడి ఇద్దరు యువకుల దుర్మరణం
- గరుడ వారధిపై ఘటన
- మోహన్ బాబు యూనివర్శిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్ధులు
- బుల్లెట్ బైక్పై వెళుతూ ప్రమాదానికి గురైన వైనం
వీరు ఇద్దరూ బుల్లెట్ బైక్పై తిరుపతి గరుడ వారధిపై వేగంగా వెళుతుండగా, లక్ష్మీపురం కూడలి మలుపు వద్ద వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు సుమారు 30 అడుగుల దిగువన ఉన్న ప్రధాన రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.