RBI: 699.96 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత ఫారెక్స్ నిల్వలు
- అక్టోబర్ 3తో ముగిసిన వారానికి ఆర్బీఐ డేటా విడుదల
- విదేశీ కరెన్సీ అసెట్స్ 577.71 బిలియన్ డాలర్లు
- 98.77 బిలియన్ డాలర్లకు చేరిన బంగారం నిల్వలు
అక్టోబర్ 3తో ముగిసిన వారానికి భారత దేశ విదేశీ మారక నిల్వలు 699.96 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడైంది. రిజర్వులో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో 577.71 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఈ డేటా తెలుపుతోంది.
మొత్తం మీద విదేశీ మారక నిల్వలు గత వారంలో 700.24 బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా తగ్గినప్పటికీ, బంగారం నిల్వలు 3.75 బిలియన్ డాలర్లకు పైగా పెరిగి 98.77 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సేకరించాయి.
2024 నుంచి ఆర్బీఐ బంగారం నిల్వలకు 75 టన్నులు జోడించింది. దీంతో భారత్ వద్ద బంగారం నిల్వలు 880 టన్నులకు చేరుకున్నాయి. ఇది ఇప్పుడు విదేశీ మారక నిల్వల్లో 14 శాతంగా ఉందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలిపింది. విదేశీ మారక నిల్వలు పెరగడం వల్ల ఆర్బీఐకి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలోపేతం కావడానికి అధిక అవకాశం లభిస్తుంది. తగినంత ఫారెక్స్ నిల్వలు, రూపాయి విలువ మరింత పతనం కాకుండా నిరోధిస్తాయి.
భారతదేశం వద్ద ఉన్న విదేశ మారక ద్రవ్యంతో 11 నెలలకు పైగా వస్తువుల దిగుమతి, దాదాపు 96 శాతం రుణాల చెల్లింపునకు నిధులు సమకూర్చుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
మొత్తం మీద విదేశీ మారక నిల్వలు గత వారంలో 700.24 బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా తగ్గినప్పటికీ, బంగారం నిల్వలు 3.75 బిలియన్ డాలర్లకు పైగా పెరిగి 98.77 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సేకరించాయి.
2024 నుంచి ఆర్బీఐ బంగారం నిల్వలకు 75 టన్నులు జోడించింది. దీంతో భారత్ వద్ద బంగారం నిల్వలు 880 టన్నులకు చేరుకున్నాయి. ఇది ఇప్పుడు విదేశీ మారక నిల్వల్లో 14 శాతంగా ఉందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలిపింది. విదేశీ మారక నిల్వలు పెరగడం వల్ల ఆర్బీఐకి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలోపేతం కావడానికి అధిక అవకాశం లభిస్తుంది. తగినంత ఫారెక్స్ నిల్వలు, రూపాయి విలువ మరింత పతనం కాకుండా నిరోధిస్తాయి.
భారతదేశం వద్ద ఉన్న విదేశ మారక ద్రవ్యంతో 11 నెలలకు పైగా వస్తువుల దిగుమతి, దాదాపు 96 శాతం రుణాల చెల్లింపునకు నిధులు సమకూర్చుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.