Priyanka Gandhi: డెయిరీ ఫార్మ్లో ‘అలియా భట్’.. ఆశ్చర్యపోయిన ప్రియాంక గాంధీ
- కేరళలోని వయనాడ్లో ఓ డెయిరీ ఫార్మ్ను సందర్శించిన ఎంపీ ప్రియాంక గాంధీ
- ‘అలియా భట్’ పేరున్న ఆవుతో సరదాగా గడిపిన వైనం
- నెల రోజుల దూడకు ‘మరియా’ అని పేరు పెట్టిన ప్రియాంక
- పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా
- రైతుల కష్టాలను సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తానని హామీ
కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఓ డెయిరీ ఫార్మ్ను సందర్శించారు. అయితే, ఈ పర్యటనలో బాలీవుడ్ నటి పేరున్న ఓ ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫార్మ్లో ‘అలియా భట్’ అని పిలుస్తున్న ఆవును చూసి ప్రియాంక ఎంతో ఆసక్తి కనబరిచారు.
వివరాల్లోకి వెళితే... వయనాడ్లోని తిరువంబడి పరిధిలో ఉన్న కోడెన్చెరి డెయిరీ ఫార్మ్ను ప్రియాంక గాంధీ ఈ వారం ప్రారంభంలో సందర్శించారు. స్థానిక పాల సహకార సంఘం డైరెక్టర్ షీబా ఫ్రాన్సిస్ నడుపుతున్న ఈ ఫార్మ్లో ఆవుల పేర్లు అడిగి తెలుసుకున్నారు. వాటిలో ‘అలియా భట్’ అనే పేరు ఆమెను బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆవులకు మేత తినిపిస్తూ, ఫార్మ్లో దాదాపు గంటసేపు గడిపారు. అక్కడే నెల రోజుల వయసున్న ఓ దూడకు ‘మరియా’ అని నామకరణం కూడా చేశారు.
ప్రియాంక గాంధీ తమ ఫార్మ్కు రావడం కలలో కూడా ఊహించలేదని, ఆమె రాకతో తమకు ఎంతో ఆనందం కలిగిందని ఫార్మ్ నిర్వాహకురాలు షీబా ఫ్రాన్సిస్ తెలిపారు. "ఆమె ఫార్మ్లోని ప్రతి విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆవుల పేర్లు అడిగారు, ముఖ్యంగా అలియా భట్ పేరు ఆమెకు బాగా నచ్చింది. మేం కూడా ఆమె సూచించినట్లే ఓ దూడకు మరియా అని పేరు పెట్టాం" అని వివరించారు.
ఈ ఫార్మ్ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలలో ఎన్నో అవార్డులు అందుకుందని, అందుకే పాడి రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రియాంక ఇక్కడికి వచ్చారని కోడెన్చెరి కో-ఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ జినూ థామస్ అన్నారు. పర్యటనలో భాగంగా ప్రియాంక స్థానిక రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం పాడి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, ఖర్చులకు, ఆదాయానికి పొంతన లేకపోవడంతో చాలామంది ఈ రంగాన్ని వదిలేస్తున్నారని జినూ థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల మందుల ధరలు పెరగడం, సరైన బీమా సౌకర్యం లేకపోవడం, నాణ్యమైన దాణా కొరత, వన్యమృగాల దాడులు వంటి సమస్యలను రైతులు ప్రియాంక దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఈ పర్యటనకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వివరాల్లోకి వెళితే... వయనాడ్లోని తిరువంబడి పరిధిలో ఉన్న కోడెన్చెరి డెయిరీ ఫార్మ్ను ప్రియాంక గాంధీ ఈ వారం ప్రారంభంలో సందర్శించారు. స్థానిక పాల సహకార సంఘం డైరెక్టర్ షీబా ఫ్రాన్సిస్ నడుపుతున్న ఈ ఫార్మ్లో ఆవుల పేర్లు అడిగి తెలుసుకున్నారు. వాటిలో ‘అలియా భట్’ అనే పేరు ఆమెను బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆవులకు మేత తినిపిస్తూ, ఫార్మ్లో దాదాపు గంటసేపు గడిపారు. అక్కడే నెల రోజుల వయసున్న ఓ దూడకు ‘మరియా’ అని నామకరణం కూడా చేశారు.
ప్రియాంక గాంధీ తమ ఫార్మ్కు రావడం కలలో కూడా ఊహించలేదని, ఆమె రాకతో తమకు ఎంతో ఆనందం కలిగిందని ఫార్మ్ నిర్వాహకురాలు షీబా ఫ్రాన్సిస్ తెలిపారు. "ఆమె ఫార్మ్లోని ప్రతి విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆవుల పేర్లు అడిగారు, ముఖ్యంగా అలియా భట్ పేరు ఆమెకు బాగా నచ్చింది. మేం కూడా ఆమె సూచించినట్లే ఓ దూడకు మరియా అని పేరు పెట్టాం" అని వివరించారు.
ఈ ఫార్మ్ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలలో ఎన్నో అవార్డులు అందుకుందని, అందుకే పాడి రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రియాంక ఇక్కడికి వచ్చారని కోడెన్చెరి కో-ఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ జినూ థామస్ అన్నారు. పర్యటనలో భాగంగా ప్రియాంక స్థానిక రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం పాడి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, ఖర్చులకు, ఆదాయానికి పొంతన లేకపోవడంతో చాలామంది ఈ రంగాన్ని వదిలేస్తున్నారని జినూ థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల మందుల ధరలు పెరగడం, సరైన బీమా సౌకర్యం లేకపోవడం, నాణ్యమైన దాణా కొరత, వన్యమృగాల దాడులు వంటి సమస్యలను రైతులు ప్రియాంక దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఈ పర్యటనకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.