Ayodhya: అయోధ్యలో ఘోర ప్రమాదం.. పేలుడు ధాటికి కూలిన భవనం, ఐదుగురి మృతి
- అయోధ్యలో భారీ పేలుడుతో కుప్పకూలిన ఇల్లు
- ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు
- శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం
- గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమని ప్రాథమిక అంచనా
- సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం యోగి ఆదేశం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్రామంలోని ఇంట్లో భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ టికారామ్ ఫుండే, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సహాయక బృందాలు శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి.
పేలుడుకు గల కారణాలపై స్పష్టత రాలేదు. తొలుత బాణసంచా పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావించినా, పోలీసులు గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. "వంటగదిలో గ్యాస్ సిలిండర్ లేదా కుక్కర్ పేలినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే కచ్చితమైన కారణం చెప్పగలం" అని జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ టికారామ్ ఫుండే మీడియాకు తెలిపారు. ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో తనిఖీలు చేస్తోంది.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ దుర్ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. "అయోధ్యలో పేలుడు కారణంగా ఐదుగురు మరణించడం అత్యంత హృదయ విదారకం. క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా తక్షణ ఏర్పాట్లు చేయాలి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి" అని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ టికారామ్ ఫుండే, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సహాయక బృందాలు శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి.
పేలుడుకు గల కారణాలపై స్పష్టత రాలేదు. తొలుత బాణసంచా పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావించినా, పోలీసులు గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. "వంటగదిలో గ్యాస్ సిలిండర్ లేదా కుక్కర్ పేలినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే కచ్చితమైన కారణం చెప్పగలం" అని జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ టికారామ్ ఫుండే మీడియాకు తెలిపారు. ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో తనిఖీలు చేస్తోంది.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ దుర్ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. "అయోధ్యలో పేలుడు కారణంగా ఐదుగురు మరణించడం అత్యంత హృదయ విదారకం. క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా తక్షణ ఏర్పాట్లు చేయాలి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి" అని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.