Nellore: నెల్లూరులో దారుణం: కాలువలో ఇద్దరి మృతదేహాలు.. జంట హత్యలపై మిస్టరీ
- నెల్లూరు పెన్నా బ్యారేజీ సమీపంలో జంట హత్యల కలకలం
- జాఫర్ సాహెబ్ కాలువలో రెండు మృతదేహాల లభ్యం
- మృతులు సంచార జీవులైన పోలయ్య, శివగా గుర్తింపు
- గంజాయి బ్యాచ్ పనేనని అనుమానిస్తున్న స్థానికులు
నెల్లూరులో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. పెన్నా బ్యారేజీ సమీపంలోని జాఫర్ సాహెబ్ కాలువలో రెండు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతులు చేపల వేటపై ఆధారపడి జీవించే సంచార జీవులుగా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే... మంగళవారం ఉదయం తిక్కన పార్కు ఎదురుగా రక్తపు మరకలు ఉన్నాయని, జాఫర్ సాహెబ్ కాలువలో ఒక మృతదేహం తేలియాడుతోందని సంతపేట పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ దశరథ రామారావు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువలోని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలిస్తుండగా, దానికి వంద మీటర్ల దూరంలోనే మరో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికితీశారు.
పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మృతుల్లో ఒకరిని బాపట్ల ప్రాంతానికి చెందిన ఎం.పోలయ్యగా నిర్ధారించారు. పోలయ్య తన రెండో భార్య లక్ష్మితో కలిసి పెన్నా నది ఒడ్డున ఓ చిన్న గుడారంలో నివసిస్తున్నాడు. మరో మృతుడిని శివగా గుర్తించారు. ఇద్దరూ చేపలు పట్టుకుని జీవించే నిరుపేద సంచార జీవులని తెలిసింది.
అయితే, కేవలం చేపల వేటపై బతికే వీరిని ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యల వెనుక గంజాయి బ్యాచ్ హస్తం ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నది పరిసరాల్లో గంజాయి తాగే కొందరు వ్యక్తులు, మత్తులో వీరిపై దాడి చేసి హత్య చేసి ఉంటారని చెబుతున్నారు.
ఈ ఘటనలో ఐదుగురికి పైగా పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, నేరం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా పనిచేయకపోవడం దర్యాప్తుకు అడ్డంకిగా మారింది. ఈ జంట హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళితే... మంగళవారం ఉదయం తిక్కన పార్కు ఎదురుగా రక్తపు మరకలు ఉన్నాయని, జాఫర్ సాహెబ్ కాలువలో ఒక మృతదేహం తేలియాడుతోందని సంతపేట పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ దశరథ రామారావు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువలోని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలిస్తుండగా, దానికి వంద మీటర్ల దూరంలోనే మరో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికితీశారు.
పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మృతుల్లో ఒకరిని బాపట్ల ప్రాంతానికి చెందిన ఎం.పోలయ్యగా నిర్ధారించారు. పోలయ్య తన రెండో భార్య లక్ష్మితో కలిసి పెన్నా నది ఒడ్డున ఓ చిన్న గుడారంలో నివసిస్తున్నాడు. మరో మృతుడిని శివగా గుర్తించారు. ఇద్దరూ చేపలు పట్టుకుని జీవించే నిరుపేద సంచార జీవులని తెలిసింది.
అయితే, కేవలం చేపల వేటపై బతికే వీరిని ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యల వెనుక గంజాయి బ్యాచ్ హస్తం ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నది పరిసరాల్లో గంజాయి తాగే కొందరు వ్యక్తులు, మత్తులో వీరిపై దాడి చేసి హత్య చేసి ఉంటారని చెబుతున్నారు.
ఈ ఘటనలో ఐదుగురికి పైగా పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, నేరం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా పనిచేయకపోవడం దర్యాప్తుకు అడ్డంకిగా మారింది. ఈ జంట హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.