హిమాచల్లో ఘోర ప్రమాదం.. బస్సుపై విరిగిపడిన కొండచరియలు.. 18 మంది మృతి
- హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ప్రమాదం
- ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
హర్యానాలోని రోహ్తక్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని ఘుమర్విన్కు ప్రైవేటు బస్సు బయలుదేరింది. ఝండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూఘాట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో వాహనం పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.