టారిఫ్ ల పవర్ తోనే యుద్ధాలను ఆపా: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ఆ అధికారమే లేకుంటే ఇప్పుడు కనీసం నాలుగు యుద్ధాలు జరుగుతుండేవన్న ట్రంప్
- శాంతి నెలకొల్పడంతో పాటు భారీగా ఆదాయం కూడా పొందామన్న అమెరికా అధ్యక్షుడు
- ఇండియా పాకిస్థాన్ యుద్ధం తానే ఆపానని మరోమారు వ్యాఖ్య
భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోమారు వ్యాఖ్యానించారు. టారిఫ్ లు విధిస్తానని హెచ్చరించడం ద్వారా, వ్యాపార ఒప్పందాల పేరుతో బెదిరించి రెండు దేశాలను యుద్ధ విరమణకు ఒప్పించినట్లు చెప్పారు. అణ్వాయుధ దేశాలైన భారత్, పాక్ మధ్య యుద్ధం మొదలయ్యాక కనీసం ఏడు ఫైటర్ జెట్లు కూలిపోయాయని ట్రంప్ చెప్పారు. దీంతో తాను కల్పించుకుని రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా చేశానన్నారు. అయితే, యుద్ధం విరమించేందుకు భారత్, పాక్ లను ఏమని బెదిరించారనే విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు.