ఆర్టీఐ కొత్త లోగోను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
- సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీఐ కమిషన్ బృందం భేటీ
- జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వక సమావేశం
- 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా కార్యక్రమం
ఈ కార్యక్రమానికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బృందం హాజరైంది. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సీఎంను కలిసిన వారిలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి ఉన్నారు.
కాగా, రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్లో చాలాకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ల బృందం ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.