Advertisement

ఆర్టీఐ కొత్త లోగోను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Unveils New RTI Logo
  • సీఎం రేవంత్‌ రెడ్డితో ఆర్టీఐ కమిషన్ బృందం భేటీ
  • జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వక సమావేశం
  • 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషన్‌కు కొత్త లోగో వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈ నూతన లోగోను ఆవిష్కరించారు. 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ కార్యక్రమానికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బృందం హాజరైంది. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సీఎంను కలిసిన వారిలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి ఉన్నారు.

కాగా, రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్‌లో చాలాకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ల బృందం ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
Advertisement
Revanth Reddy
Telangana RTI
RTI logo
Right to Information
Chandrashekhar Reddy
Boreddy Ayodhya Reddy
PV Srinivasa Rao
Mohsina Parveen
Desala Bhupal
Merla Vaishnavi

More Telugu News