అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న కవిత
- దత్తాత్రేయ అంటే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తిగా తెలుసన్న కవిత
- 20 ఏళ్లుగా కుల, మతాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారన్న కవిత
- దత్తన్న వద్దకు ఏదైనా పని కోసం వెళితే కచ్చితంగా పరిష్కారమయ్యేదని వ్యాఖ్య
దత్తాత్రేయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. తాను రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో దత్తాత్రేయ గురించి చాలామంది తనకు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఏదైనా పని కోసం దత్తన్న వద్దకు వెళితే వారి సమస్య కచ్చితంగా పరిష్కారమయ్యేదని అన్నారు.
పండుగ అంటేనే పదిమంది కలవడమని, పండుగ అంటే పదిమందితో ఆనందాన్ని పంచుకోవడమని కవిత అన్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే ఇలాంటి వేదికను ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని కవిత అన్నారు. విజయలక్ష్మి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.