అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇకపై ఆన్ లైన్ లో ప్రసాదం ఆర్డర్ చేసుకోవచ్చు!
- మరో నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్న శబరిమల దేవోసం బోర్డు
- శబరిమల వరకూ వెళ్లలేని భక్తుల కోసం నిర్ణయం
- ఆర్డర్ చేసిన వారికి ఇంటికే ప్రసాదం పంపిస్తామని వెల్లడి
శబరిమలతో పాటు ట్రావెన్కూర్ సంస్థానం పరిధిలోని 1,252 దేవాలయాల ప్రసాదాలను కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే సదుపాయాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. శబరిమల లాంటి దేవాలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుందని బోర్డు తెలిపింది. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ఒక నెలలోపు పనిచేయడం ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా దేవస్వోం బోర్డు అధ్యక్షుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.